ఫస్ట్ టైమ్ తన హెల్త్ పై ఓపెనైన సమంత.. ఒక్క అడుగు కూడా వేయలేనేమో అంటూ కన్నీళ్లు పెట్టుకున్న స్టార్‌ హీరోయిన్‌

First Published Nov 8, 2022, 10:07 AM IST

సమంత మయోసైటిస్‌ అనేది అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఫస్ట్ టైమ్‌ తన ఆనారోగ్యంపై సమంత ఓపెన్‌ అయ్యింది. సుమతో మాట్లాడుతూ బాధ తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంది. 

ఇటీవల తాను నటిస్తున్న `యశోద` సినిమాకి డబ్బింగ్‌ చెబుతూ తాను ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు సమంత(Samantha) సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా మయోసైటిస్‌ అనే వ్యాధితో బాధపడుతుంది. దీని కారణంగా ఆమెకండరాలు బలహీనంగా మారిపోతుంటాయి. నొప్పులుగా ఉంటాయి. త్వరగా అలసిపోవడం చేస్తుంటుంది. కండరాల ఇన్‌ఫెక్షన్ గా చెప్పొచ్చు. గత మూడు నాలుగు నెలలుగా సమంత ఈ వ్యాధితో బాధపడుతుంది. ఇప్పుడిప్పుడే దాన్నుంచి కోలుకుంటుంది.

తాజాగా ఫస్ట్ టైమ్‌ సమంత తన అనారోగ్యంపై స్పందించింది. `యశోద` ప్రమోషన్‌ లో భాగంగా యాంకర్‌ సుమతో చిట్‌ చేస్తున్న సమయంలో హెల్త్ మ్యాటర్‌ ప్రస్తావన రాగా, సమంత ఎమోషనల్‌ అయ్యింది. బాధని కంట్రోల్‌ చేసుకోలేక ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. నోట మాట రాని పరిస్థితిలోకి వెళ్లిపోయింది. ఎదురుగా ఉన్న సుమ సైతం సమంత బాధని, కన్నీళ్లని చూసి ఆమె గుండె బరువెక్కింది. 

ఇందులో సమంత చెబుతూ, పోస్ట్ లో పేర్కొన్నట్టు, లైఫ్‌లో బ్యాడ్‌ డేస్‌ ఉంటాయి, గుడ్‌ డేస్‌ ఉంటాయి. కొన్ని భరించలేని రోజులుంటాయి. ఒక్కొక్క రోజైతే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేననిపించింది. ఒక్క అడుగు ముందుకేస్తే చాలనిపించింది. తిరిగి చూస్తుంటే ఇంత దాటి వచ్చానా? అనిపిస్తుంది అంటూ ఎమోషనల్ అయ్యింది సమంత. అయితే తాను ఒంటరి కాదని, తన వెంట చాలా మంది ఉన్నారని, అందరి సపోర్ట్ తో ఫైనల్‌గా తాను విజయం సాధించానని తెలిపింది.

`యశోద` సినిమాలో తన పాత్ర కూడా తనకు రియల్‌ లైఫ్‌కి దగ్గరగా ఉంటుందని చెప్పింది సమంత. తను ఉన్న ప్రపంచానికి, తను వెళ్లిన ప్రపంచానికి చాలా తేడా ఉంటుంది. కంప్లీట్‌ డిపరెంట్‌గా ఉంటుంది. అదొక బొమ్మరిల్లులా ఉంటుంది. సినిమాలో యశోద(Yashoda) చాలా డిఫికల్ట్స్ ఫేస్‌ చేసింది. దాన్ని ఎదుర్కొని సర్వైవ్‌ అయ్యింది. ఇప్పుడు నేను కూడా అలాంటి డిఫికల్ట్ పొజిషిన్‌లోనే ఉన్నాను. బాగా సర్వైవ్‌ అవుతానని భావిస్తున్నా. ఈ రకంగా సినిమాకి, నా రియల్‌ లైఫ్‌కి సిమిలారిటీస్‌ ఉన్నాయని వెల్లడించింది సమంత.  
 

`యశోద`కి డబ్బింగ్‌ చెప్పడం గురించి చెబుతూ, తమిళంలో కంటే తెలుగు చెప్పడమే కష్టమని చెప్పింది. అయితే కష్టసమయంలో డబ్బింగ్‌ చెప్పాల్సి వచ్చిందని, కానీ తాను మొండిదాన్ని అని, అందుకే కష్టమైనా డబ్బింగ్‌ చెప్పానని పేర్కొంది సమంత. సినిమా గురించి చెబుతూ, తనకు చేసిన జోనర్‌, సేమ్‌రోల్‌ చేయడం ఇష్టం ఉండదని, కానీ `యూటర్న్`, `యశోద` జోనర్‌ దగ్గరగా ఉంటాయని చెప్పింది. అయితే `యశోద` కథ విన్నప్పుడు తాను ఎంత షాక్‌ అయ్యిందో, రేపు థియేటర్లలో ఆడియెన్స్ సినిమా చూసి అంతే షాక్‌ అవుతారని పేర్కొంది. ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానున్న విషయం తెలిసిందే.

click me!