సమంతకి అనారోగ్యం..అమెరికాలో ట్రీట్‌మెంట్‌.. క్లారిటీ ఇచ్చిన మేనేజర్‌

First Published Sep 21, 2022, 1:19 PM IST

స్టార్‌ హీరోయిన్‌ సమంత అనారోగ్యంతో బాధపడుతుందని, ఆమె చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతుందని పుకార్లు వైరల్‌ అవుతున్న నేపథ్యంలో తాజాగా మేనేజర్‌ స్పందించారు. క్లారిటీ ఇచ్చారు. 

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత అనారోగ్యానికి గురైందని, ఆమె అమెరికాలో చికిత్స తీసుకుంటున్నట్టు వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో సమంతకి ఏమైంది? అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పైగా గత రెండు నెలలుగా సమంత కనిపించడం లేదు. దీంతో ఈ అనుమానాలకు, రూమర్లకి బలం చేకూరినట్టయ్యింది. 
 

తాజాగా దీనిపై సమంత మేనేజర్‌ స్పందించారు. సమంత అనారోగ్యంపై వస్తోన్న వార్తలను మేనేజర్‌ ఖండించారు. సమంతకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని స్పష్టం చేశారు. సమంత ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ నిజం కాదని, ఆమె పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, రూమర్స్ ని నమ్మవద్దని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం సమంత అమెరికాలో ఉండటానికి కారణమేంటనేదానిపై మేనేజర్‌ క్లారిటీ ఇవ్వలేదు. 

Samantha ruth prabhu

ఇదిలా ఉంటే సమంత స్కిన్‌ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆమె గత కొంత కాలంగా `పాలీమర్‌ ఫోర్స్ లైట్‌ ఎరప్షన్‌` అనే స్కిన్కి సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని, దీంతో ఆమె సినిమా షూటింగ్‌లకు బ్రేక్‌ ఇచ్చి చికిత్స కోసం అమెరికా వెళ్లారని, దాదాపు రెండు నెలలు ట్రీట్‌మెంట్‌ తీసుకుంటుందని వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. 

దీని కారణంగా తాను నటించాల్సిన `ఖుషి` సినిమా షూటింగ్ కి బ్రేక్‌ ఇచ్చిందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేనేజర్ స్పందించి క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సమంత తెలుగులో మూడు సినిమాలు చేస్తుంది. `శాకుంతలం`, `యశోద` చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటున్నాయి. ఇటీవల `శాకుంతలం` నుంచి ఓ అప్‌డేట్‌ వచ్చిన విషయం తెలిసిందే. 

మరోవైపు విజయ్‌ దేవరకొండతో కలిసి `ఖుషి` చిత్రంలో నటిస్తుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతుంది. దీంతోపాటు హిందీలోకి ఎంట్రీ ఇస్తూ ఆయుష్మాన్‌ ఖురానాతో ఓ సినిమా చేస్తుంది. అలాగే మరో రెండు స్టార్‌ హీరోల సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం. అలాగే ఓ ఇంటర్నేషనల్‌ మూవీ చేయబోతుంది సమంత. 
 

click me!