గుండె బద్దలయ్యే పోస్ట్ చేసిన సమంత తండ్రి.. చై సామ్ విడాకులు మరచిపోలేక..

First Published Sep 5, 2022, 3:21 PM IST

టాలీవుడ్ లో క్రేజీ కపుల్స్ గా ఉన్న సమంత, నాగ చైతన్య విడిపోవడం ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రమే కాదు అభిమానులకి కూడానా హార్ట్ బ్రేకింగ్ గా మారింది. వీరిద్దరూ విడిపోయి దాదాపు ఏడాది గడుస్తోంది.

టాలీవుడ్ లో క్రేజీ కపుల్స్ గా ఉన్న సమంత, నాగ చైతన్య విడిపోవడం ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రమే కాదు అభిమానులకి కూడానా హార్ట్ బ్రేకింగ్ గా మారింది. వీరిద్దరూ విడిపోయి దాదాపు ఏడాది గడుస్తోంది. కానీ ఇప్పటికి వీరిద్దరి గురించి అభిమానుల్లో ఏదో రకంగా చర్చ జరుగుతూనే ఉంది. 2017లో వివాహం చేసుకున్న చై సామ్ నాలుగేళ్ళ తర్వాత అంతుచిక్కని కారణాలతో విడిపోయారు. 

విడాకులకు గల కారణాలు సమంత, చైతు వారి ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రమే తెలిసుండాలి. సమంత, చైతు విడిపోయిన సమయంలో సామ్ తండ్రి జోసెఫ్ ప్రభు స్పందించారు. ఈ సంగతి తెలిసిన తర్వాత తన మైండ్ బ్లాక్ అయ్యిందని ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనా సమంత, నాగ చైతన్య ఇద్దరూ తనకి ప్రియమైన వారే అని జోసెఫ్ ప్రభు అన్నారు. 

వీరిద్దరూ విడిపోయి దాదాపు ఏడాది గడుస్తున్నా ఇంకా సామ్ ఫ్యామిలీ నాగ చైతన్యని మరచిపోతున్నట్లు లేదు. సామ్ తండ్రి జోసెఫ్ తన ఫేస్ బుక్ లో వీళ్లిద్దరి విడాకుల గురించి గుండె బద్దలయ్యే పోస్ట్ పెట్టారు. సమంత నాగ చైతన్య పెళ్ళినాటి పిక్స్ షేర్ చేశారు. 

చాలా కాలం నాటి కథ.. ఆ కథ కథలాగే మిగిలిపోయింది. కాబట్టి ఇప్పుడు కొత్త కథ కొత్త అధ్యాయం మొదలు అంటూ తన ఫ్యామిలీలో జరిగిన ఓ మ్యారేజ్ కి సంబందించిన పిక్స్ షేర్ చేశారు జోసెఫ్. అలాగే సమంత, నాగ చైతన్య పిక్స్ కూడా షేర్ చేశారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. నాగ చైతన్య, సమంత అభిమానులు ఈ పోస్ట్ ని షేర్ చేస్తూ హార్ట్ బ్రేకింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

ఏ మాయ చేశావే చిత్రంతో నాగ చైతన్య, సమంత మధ్య పరిచయం ఏర్పడింది. పరిచయ కాస్త ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. చైతూతో విడిపోయాక సమంత ముంబైలో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ ఎవరి కెరీర్ లో వారు బిజీ అయిపోయారు. 

నాగ చైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. చైతు చివరగా నటించిన థాంక్యూ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఇక సమంత త్వరలో యశోద చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ థ్రిల్లర్ అంశాలతో పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ కానుంది. 

click me!