ప్రభాస్ vs సల్మాన్ ఖాన్, బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్.. గెలుపెవరిది?

Published : Apr 26, 2026, 03:24 PM IST

2027 ఈద్ పండగకు తన సినిమా రిలీజ్ అవుతుందని సల్మాన్ ఖాన్ ప్రకటించారు. అదే సమయంలో ప్రభాస్ సినిమా కూడా రాబోతుండటంతో,  బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద క్లాష్ జరగనుంది. ఇద్దరు పాన్ ఇండియా హీరోల యుద్దంలో గెలుపెవరిది? 

PREV
16
సల్మాన్ ఖాన్ vs ప్రభాస్..

2027 ఈద్ పండగ రోజున బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద ఫైట్ జరగనుంది. ఒకవైపు సల్మాన్ ఖాన్ తన కొత్త సినిమాతో వస్తుంటే, మరోవైపు ప్రభాస్ 'స్పిరిట్' సినిమా కూడా అదే తేదీన విడుదలకు సిద్ధమైంది. ఈ ఇద్దరు దిగ్గజ నటుల మధ్య పాన్ ఇండియాలో  గట్టి పోటీ ఖాయం. ఎవరు గెలుస్తారో  చూడాలి.

26
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్ ఈసారి సౌత్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ చిత్రానికి 'SVC63' అని పేరు పెట్టారు. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాత. ఇది ఒక భారీ పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా మొదలైంది.
36
సల్మాన్ ఖాన్ సరసన నయనతార..

సల్మాన్ ఖాన్ 'SVC63' చిత్రంలో సౌత్ నటి నయనతార హీరోయిన్ గా కనిపించనున్నారు. సల్మాన్, నయనతార కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే మొదటిసారి. నయనతార గతంలో షారుఖ్ ఖాన్‌తో కలిసి 'జవాన్' చిత్రంలో నటించారు. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.

46
మాతృభూమి సినిమా పనుల్లో బిజీగా

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తన 'మాతృభూమి' సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను థియేటర్లకు బదులుగా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.  ఇందులో సల్మాన్‌తో పాటు చిత్రాంగద సింగ్ హీరోయిన్‌గా నటించారు. అపూర్వ లాఖియా ఈ చిత్రానికి దర్శకుడు.

56
స్పిరిట్ సినిమాపై భారీ అంచనాలు..

ప్రభాస్ 'స్పిరిట్' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ చిత్రం 2027 ఈద్ పండగకు థియేటర్లలో విడుదల కానుంది. ఇది సల్మాన్ ఖాన్ సినిమాతో పోటీ పడనుంది. 'స్పిరిట్' చిత్రంలో ప్రభాస్ సరసన తృప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రభాస్, తృప్తి కూడా మొదటిసారి కలిసి నటిస్తున్నారు.

66
దసరా సందర్భంగా థియేటర్లలో

ఈ సినిమా ఆడియో టీజర్ ఇప్పటికే విడుదలైంది. మరోవైపు, ప్రభాస్ నటిస్తున్న పీరియడ్ యాక్షన్-డ్రామా చిత్రం 'ఫౌజీ'. దీనికి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా 2026 దసరా పండగ సందర్భంగా థియేటర్లలో విడుదల కానుందని అంటున్నారు. ఇది 1940ల నాటి సైనిక నేపథ్యంతో కూడిన యుద్ధ కథ. ఇందులో అనుపమ్ ఖేర్, జయప్రద, మిథున్ చక్రవర్తి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇమాన్ ఇస్మాయిల్ హీరోయిన్.

Read more Photos on
click me!

Recommended Stories