ఏరా హెల్మెట్ కొన్నావా.. సాయిధరమ్ తేజ్ ని పవన్ అడిగిన మొదటి ప్రశ్న

First Published Sep 11, 2021, 12:40 PM IST

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురై గాయాల పాలు కావడం చిత్ర పరిశ్రమని షాక్ కి గురి చేసింది. మెగా అభిమానులు ఆందోళనకు గురయ్యారు.

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురై గాయాల పాలు కావడం చిత్ర పరిశ్రమని షాక్ కి గురి చేసింది. మెగా అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ కు హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. 

మెగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళుతూ ఎప్పటికప్పుడు తేజు ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు. తేజు ఖరీదైన స్పోర్ట్స్ బైక్ పై వెళుతూ ప్రమాదానికి గురయ్యాడు. తేజుకి బైకులంటే మక్కువ ఎక్కువ. గతంలో తేజు స్వయంగా బైకులంటే తనకు ఎంత ఇష్టమో ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. 

ఐదేళ్ల క్రితం తేజు కొత్త బైక్ కొన్నప్పుడు ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. కొత్త బైక్ కొన్నారట కదా అని ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. అవునండీ.. నాకు బైకులంటే ఇష్టం. మా తాతయ్యని బైక్ పై బయటకు తీసుకెళ్ళేవాడిని. అలాగే కళ్యాణ్ గారి ద్వారా కూడా బైకులపై ఆసక్తి పెరిగింది. మొదట నాకు కళ్యాణ్ గారు లోకో మోటో అవెంజర్ బైక్ ని ఇచ్చారు. 

అలా క్రమంగా నాకు బైక్ రైడింగ్ ప ఆసక్తి పెరిగింది. ఇటీవల బైక్ కొన్నప్పుడు కళ్యాణ్ గారికి వెళ్లి చూపించాను. నా కొత్త బైక్ అని చెప్పాను. ఆయన నన్ను అడిగిన మొట్టమొదటి ప్రశ్న 'ఏరా హెల్మెట్ కొన్నావా' అని అడిగారు. కొన్నానండీ (నవ్వుతూ) అని చెప్పాను. వేగంగా బైక్ నడపవద్దు అని కళ్యాణ్ గారు చెప్పారు. 

నేను బైక్ తీసుకుని బయటకు వెళితే ఇంట్లో మా అమ్మకు టెన్షన్. వేగంగా నడుపుతాను అని కాదు.. టు వీలర్ అన్నాక ఎంతోకొంత భయం ఉంటుంది అని తేజు తెలిపాడు. అలా ఎప్పుడూ తనపై కుటుంబ సభ్యుల, పవన్ గారి కేరింగ్ ఉంటుందని తేజు తెలిపాడు. 

తేజు ప్రమాదానికి గురయ్యాక మొదట మెడకోవర్ ఆసుపత్రిలో చేర్చారు. వెంటనే పవన్ ఆసుపత్రికి వెళ్లి తేజు ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న సంగతి తెలిసిందే. మెడికవర్ ఆసుపత్రి నుంచి తేజుని అపోలోకి మార్చారు. 

click me!