Devatha: స్వార్థంలేని ప్రేమ ఆదిత్య దగ్గర మాత్రమే దొరుకుతుంది.. మాధవకు షాకిచ్చిన రుక్మిణి!

First Published Jun 27, 2022, 10:59 AM IST

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత (Devatha) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 27 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

 ఈరోజు ఎపిసోడ్ లో దేవుడమ్మ(devudamma) కుటుంబం మొత్తం సంతోష పడుతూ ఉండగా అప్పుడు దేవుడమ్మ రుక్మిణి ఎక్కడ ఉంది అని తలుచుకొని బాధ పడుతుంది. అప్పుడు ఆదిత్య రుక్మిణి ఎలా అయినా ఇంటికి వస్తుంది అని అనడంతో వెంటనే ఈశ్వర్ ఎలా చెబుతున్నావు అని ఆదిత్య(adithya)ను అడగగా తన నమ్మకమే ఆదిత్య నమ్మకము అని అంటుంది దేవుడమ్మ. ఇంతలో అక్కడికి సత్య వచ్చి అందరికీ గుడ్ న్యూస్ అని అంటుంది.
 

 అప్పుడు దేవుడమ్మ అందరికీ గుడ్ న్యూస్ ఆ ఏంటి సత్య అది అని అడగగా నాకు తల్లి అయ్యే అదృష్టం ఉంది అని అనడంతో అందరూ సంతోషపడతారు. అమెరికాలో నా ప్రాబ్లం కి సంబంధించిన హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేస్తారు అని అనడంతో అప్పుడు వెంటనే ఇక ఆలస్యం ఎందుకు వెంటనే బయలుదేరండి అని అంటుంది. కానీ ఆదిత్య మాత్రం సత్య(sathya) మాటలకు ఆశ్చర్యపోతూ ఇప్పుడు అమెరికా కి వెళితే దేవి(devi) కి దూరం అవుతాను అని బాధపడుతూ ఉంటాడు.
 

అప్పుడు ఆదిత్య(adithya)అమెరికా కి వెళ్ళడానికి సమయం పడుతుంది అని అనగా వెంటనే సత్య ఏం జరగదు ట్రీట్మెంట్ వల్ల తొందరగా పంపిస్తారు అని అనడంతో సంతోషం తో హడావిడి చేస్తూ ఉంటుంది. అప్పుడు దేవుడమ్మ రుక్మిణి(rukmini)బతికే ఉంది సత్యకు తల్లి అయ్యే అదృష్టం ఉంది అని సంతోషపడుతూ ఉంటుంది. మరొక వైపు రాధా తర్వాత ఇచ్చిన వాయనం ను చూసి మురిసిపోతూ ఆ విషయాన్ని ఎలా అయినా ఆదిత్యకు చెప్పాలి అని అనుకుంటుంది.
 

 ఆ తర్వాత ఆదిత్య (adithya)వాళ్ల పిన్ని ని దేవుడమ్మ పిలిచి ఆదిత్య వాళ్లతో పాటు అమెరికాకు వెళ్ళమని చెబుతుంది. మరొక వైపు రాధ(radha) అత్తమ్మ ఇచ్చిన వాయనం తనకు వచ్చింది అనడంతో ఆదిత్య షాక్ అవుతాడు. కానీ అత్తయ్య తనని చూడలేదు అని అనడంతో కొంచెం ఊపిరి తీసుకుంటాడు. అప్పుడు ఆదిత్య గురించి చెబుతూ బాధపడతాడు.
 

ఆ తరువాత సత్య(sathya)కు పిల్లలు కలగడం కోసం అమెరికాకు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వెళుతున్నాము అని అనడంతో అప్పుడు వెంటనే రాదా పిల్లలు పుడతారు అంటే ఖచ్చితంగా వెళ్లాలి సంతోషంగా వెళ్ళండి అని చెబుతుంది. అప్పుడు ఆదిత్య(adithya)మాత్రం మిమ్మల్ని ఈ పరిస్థితిలో వదిలి వెళ్ళడం ఇష్టం లేదు అని బాధపడతాడు.
 

మరొక వైపు మాధవ రాధ(radha)కు ఆదిత్య ఫోన్ చేస్తున్న విషయం తెలుసుకొని కోపంతో రగిలి పోతూ ఉంటాడు. మరొకవైపు దేవుడమ్మ రుక్మిణి (rukmini) గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండగా ఇంతలో రాజమ్మ అక్కడికి వచ్చి ధైర్యం చెబుతుంది. ఆ తర్వాత మాధవ ఇంట్లో పిల్లలు సంతోషంగా ఆడుతూ ఉండగా అప్పుడు మాధవ దేవి పై అరిచి కోపగించుకుంటాడు. ఆ తర్వాత దేవి నీ దగ్గరికి తీసుకొని స్వారీ చెప్పగా దేవి మాత్రం బాధపడుతూ లోపలికి వెళ్లి పోతుంది. అప్పుడు రాధ మాధవ పై కోప్పడుతుంది.

click me!