ఈవారం థియేటర్ లో అబ్బాయి రామ్ చరణ్.. ఓటీటీలో బాబాయి పవన్ కళ్యాణ్.. రచ్చ రచ్చే..

Published : Mar 21, 2022, 05:45 PM ISTUpdated : Mar 21, 2022, 05:50 PM IST

 ఈ వారం సినిమా థియేటర్లు, ఓటీటీలు మోత మోగనున్నాయి. రెండు భారీ  సినిమాలు అటు థియేటర్లను.. ఇటు ఓటీటీని దడదడలాడించబోతున్నాయి.  ట్రిపుల్ ఆర్ తో రామ్ చరణ్.. భీమ్లా నాయక్ తో పవర్ స్టార్ రెడీ అవుతున్నారు..

PREV
19
ఈవారం థియేటర్ లో అబ్బాయి రామ్ చరణ్.. ఓటీటీలో బాబాయి పవన్ కళ్యాణ్.. రచ్చ రచ్చే..

అబ్బాయి రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ తో థియేటర్లను టార్గెట్ చేస్తే.. ఓటీటీలో ఫ్యామిలీ ఆడియన్స్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాన్ భీమ్లానాయక్ సందడి చేయబోతున్నారు. అంతే కాదు.. పవర్ స్టార్ తో కలిసి ఓటీటీలో అజిత్ కూడా సై అంటున్నాడు. 
 

29

ఈవారం థియేటర్ రిలీజ్ కోసం ఏ సినిమాలు సాహసం చేయలేక పోయాయి. డ్రాగన్ లా ఆర్ఆర్ఆర్ రిలీజ్ అవ్వబోతుండటంతో.. కొండను ఢీకొట్టడానికి ఏ సినిమా సాహసం చేయలేకపోయింది. దాంతో థియేటర్లన్నీ ట్రిపుల్ ఆర్ రిలీజ్ తో నిండిపోబోతున్నాయి. సింహం సింగిల్ గా వస్తుంది అన్న మాదిరిగా ట్రిపుల్ ఆర్.. సోలోగా రాజ్యం ఏలబోతుంది. 

39

యావత్ దేశం తో పాటు ప్రపంచ సినిమా ఎంతో  ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. ఈ సినిమా ఈవారమే రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ శుక్రవారం 25 మార్చ్ ట్రిపుల్ ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సందడి చేయబోతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ స్క్రీన్ శేర్ చేసుకుని తెరకెక్కిన మల్టీ స్టారర్ మూవీని టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించారు. 

49

దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆలియా బట్ నటించగా అజయ్ దేవగణ్, శ్రీయా శరన్, హాలీవుడ్ స్టార్ ఓలివియో లీడ్ రోల్స్ చేశారు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటించారీ సినిమాలో.  కీరవాణి  సంగీతం అందించిన ఈ సినిమా లోనుంచి రిలీజ్ అయిన ప్రతీ అప్ డేట్ కు భారీగా రెస్పాన్స్ వచ్చింది. 

59

కరోనా వల్ల డిలే అవుతూ వస్తోన్న ఈసినిమా మూడు సార్లు రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఆతరువాత ఏపీలో  టికెట్ ధరల విషయం కూడా ట్రిపుల్ ఆర్ ను ఇబ్బంది పెట్టింది. ఇక అన్ని ఇబ్బందులు దాటుకుని రిలీజ్ కు రెడీ అయ్యంది సినిమా. అటు  ఏపీ, తెలంగాణలో టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాలు వెసులుబాటును కల్పించడంతో ఊపిరి పీల్చుకున్నారు ట్రిపుల్ ఆర్ టీమ్. 

69

ఇక థియేటర్ లో ట్రిపుల్ ఆర్ కింగ్ లా మారబోతుండగా.. ఓటీటీలో పవర్ స్టార్ కింగ్ అంవ్వబోతున్నారు. పిబ్రవరి 25న రిలీజ్ అయిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ భారీ కలెక్షన్స్ తో రచ్చ రచ్చ చేసింది. సాగర్ చంద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు మాటలు,స్క్రీన్ ప్లే ను త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. ఈ సినిమాలో రానా పవర్ స్టార్ తో స్క్రీన్ శేర్ చేసుకున్నారు. 

79

నిత్యా మేనన్.. సంయుక్తా మేనన్ హీరోయిన్లుగా నటిచిన ఈసినిమా మలయాళ సినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్ కు రీమేక్ గా తెరకెక్కింది. ఇక ఈసినిమాను ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అవుతుంది. ట్రిపుల్ ఆర్ రిలీజ్ అవుతున్న రోజే.. అంటే మార్చ్ 25న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. 

89

ఇక భీమ్లా నాయక్ తో పాటు మరో పెద్ద సినిమా కూడా డిజిటల్ గుమ్మం తొక్కబోతోంది. తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన వాలిమై మూవీ కూడా ఓటీటీ రిలీజ్ కు రెడీ అయ్యింది. వినోడ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమాలో అజిత్ తో పాటు తెలుగు యంగ్ స్టార్ కార్తికేయ  మెయిన్ విలన్ క్యారెక్టర్ లో నటించారు.  

99

అయితే తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా.. తెలుగులో మాత్రం ఏ మాత్రం ప్రభావం చూపించలేక పోయింది. ఇప్పుడు ఓటీటీలో ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అయ్యింది. పిబ్రవరి 24న థియేటర్ లో రిలీజ్ అవ్వగా.. మార్చ్ 25న జీ5 లో స్ట్రీమింగ్ కాబోతోంది  వాలిమై మూవీ. 
 

Read more Photos on
click me!

Recommended Stories