యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య (Naga Shaurya) బ్యాచిలర్ లైఫ్ ను వీడి.. మ్యారేజ్ లైఫ్ లోకి అడుగుపెట్టారు. ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి (Anusha Shetty)ని పెళ్లి చేసుకొని పవిత్రబంధం తాలుకూ ప్రయాణాన్ని ప్రారంభించారు.
జీవితంలో పెళ్లి అనే కార్యం ఒక్కసారే జరుగుతుంది. పంచభూతాల సాక్షిగా జరిగే ఈ వేడుక అందరికీ గుర్తుండిపోయేలా ఉండాలనేది ప్రతిఒక్కరి కోరిక. అందుకు తగ్గట్టుగానే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తుంటారు. ఇక సెలబ్రెటీల విషయంలో చెప్పనక్కర్లేదు. తాజాగా నాగశౌర్య పెళ్లిలోనూ అరేంజ్ మెంట్స్ గ్రాండ్ గా ఉన్నాయి.
ముఖ్యంగా వెడ్డింగ్ కి విచ్చేసిన అతిథులకు పెళ్లివారు మరిచిపోలేని విందును ఏర్పాటు చేయడం విశేషం. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విందులో రాజుల కాలాన్ని గుర్తుచేసేలా ఏర్పాట్లు చేయడం ఆకర్షణీయంగా మారింది.
పెళ్లికి వచ్చిన అతిథులందరికీ సంప్రదాయ ప్రకారం.. రాచరికపు పద్ధతిలో భోజనాలను వడ్డించి షాక్ కు గురి చేశారు. ఒక్కో అతిథికి ఒక్కో టేబుల్ ఏర్పాటు రాయల్ లంచ్ ను ఏర్పాటు చేశారు. విందులో 12 రకాల వంటకాలను, నాలుగు రకాల స్వీట్లను వడ్డించి ఆహా అనిపించేలా చేశారు.
ప్రస్తుతం నాగశౌర్య పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ ఫొటోలతో పాటు.. భోజనాల పొటోలు, వీడియోలు కూడా వైరల్ గా మారాయి. బెంగళూరులోని ఫైవ్ స్టార్ రేటింగ్ గల జేడబ్ల్యూ మార్రియట్ హోటల్ నిన్న గ్రాండ్ గా వెడ్డింగ్ జరిగింది. త్వరలో హైదరాబాద్ లో ఘనంగా రిసెప్షన్ ను ఏర్పాటు చేయనున్నారు.
నాగశౌర్య తన పెళ్లి మేటర్ తో అభిమానులకు సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. పెళ్లికి వారం రోజులే ఉండగా విషయం తెలిసి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి యంగ్ హీరో ఓ ఇంటివాడు కాబోతుండటంతో సినీ ప్రముఖులు, అభిమానులు నాగశౌర్యకు వెడ్డింగ్ విషెస్ తెలియజేశారు. ప్రస్తుతం శౌర్య NS24లో నటిస్తున్నారు.