RK Roja
మాజీ మంత్రి రోజా ఇటీవల ఏపీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు ఆమె ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. మళ్లీ `జబర్దస్త్` షోలోకి వస్తుందా? లేక సినిమాలు చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. రోజా రాజకీయాల్లోనే ఉంటుందా? సినిమాల్లోకి వస్తుందా అనేది పెద్ద ప్రశ్న.
ఇదిలా ఉంటే మాజీ మంత్రి రోజాపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమెని డైమండ్ రాణిగా అభివర్ణించాడు. స్కాములు చేయడంలో రోజా పెద్ద డైమండ్ రాణి అని, ఆమె స్కాములు చేసే ఉంటుందని విమర్శలు గుప్పించారు. ఆమె గురించి తనకు బాగా తెలుసు అని, ఇలాంటి పనులు చేయడంలో ఆమె దిట్ట అంటూ కామెంట్ చేశాడు బండ్ల గణేష్.
బండ్ల గణేష్ అంటే సంచలనాలకు కేరాఫ్. ఆయన స్పీచ్ ఇస్తే స్టేజ్ దద్దరిల్లిపోవాల్సిందే. పవన్ కళ్యాణ్పై ఆమె చేసే కామెంట్లు యమ క్రేజీగా ఉంటాయి. ఫ్యాన్స్ ఊగిపోయేలా ఉంటాయి. బండ్ల గణేష్ పొగడ్తలకు నవ్వులే నవ్వులు అనేలా ఉంటుంది. పవన్పై తన అభిమానాన్ని ఆ రేంజ్లో చూపిస్తుంటాడు బండ్ల గణేష. కానీ ఈ మధ్య కాస్త గ్యాప్ వచ్చింది. కొంత బేధాభిప్రాయాలు, మరికొన్ని రాజకీయాలు వీరి మధ్య గ్యాప్ని పెంచాయి. కానీ పవన్పై తన ప్రేమ, అభిమానం మాత్రం అలానే ఉందని చెప్పాలి.
ఆ ప్రేమని మరోసారి చాటుకున్నాడు బండ్ల గణేష్. ఆయన ఇటీవల ఏపీ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి చోట గెలిచిన విషయం తెలిసిందే. దేశ రాజకీయ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని రికార్డు మా బాస్ కి సొంతమైందని, అది మా బాస్ రేంజ్ అని, ఇప్పుడు వచ్చిన పదవులు కూడా ఆయన రేంజ్ కాదు, ఆయనది వేరే రేంజ్, కానీ ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్ప అంటుంటారు, ఇక్కడ తగ్గాడు మా బాస్ అని తన అభిమానాన్ని వెల్లడించారు బండ్ల గణేష్.
ఈ సందర్భంగా రోజాపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. `ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్ పోటీల్లో రోజా వంద కోట్ల స్కామ్ చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ టీవీ ఛాన్స్ చర్చలో బండ్ల గణేష్ పాల్గొన్నారు. రోజా మాత్రం ఈ స్కామ్ చేసిందని, అందులో మరో ఆలోచన లేదని వెల్లడించారు నిర్మాత. స్కాముల్లో ఆమె డైమండ్ రాణి అంటూ సెటైర్లు పేల్చాడు బండ్ల గణేష్. కేవలం వంద కోట్లు మాత్రమే కాదు ఎక్కువే స్కామ్ చేసి ఉంటుందని, ఆమెపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశాడు బండ్ల గణేష్. అంతేకాదు తిరుమల శ్రీవారి దర్శనానికి పంపినందుకు కూడా డబ్బులు వసూలు చేసేదని దుమారం రేపాడు బండ్ల గణేష్. ప్రస్తుతం ఈ బడా నిర్మాత వ్యాఖ్యలు ఇటు టాలీవుడ్లో, అటు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.
తనపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిందని, ఆమెకి ఎదురు చెప్పేవారు ఉండకూడదని అన్నారు. మాజీ సీఎం చుట్టూ వీరంతా చేరి ఆయన్ని మనిషి కాకుండా చేశారని, మరో అవతారంలా క్రియేట్ చేశారని, వాస్తవాలు తెలియకుండా చేసి ఇప్పుడు ఇంతటి పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపించాడు బండ్ల గణేష్.