Guppedantha Manasu: చదువు కోసం దూరంగా ఉన్న రిషీ, వసు.. సాక్షి వలలో దేవయాని!

Published : Aug 29, 2022, 08:33 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఆగస్ట్ 29వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం...  

PREV
16
Guppedantha Manasu: చదువు కోసం దూరంగా ఉన్న రిషీ, వసు.. సాక్షి వలలో దేవయాని!

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే...మహేంద్ర గౌతమ్ లు రిషి దగ్గరికి వెళ్లి రిషి ని లేపుతారు. అప్పుడు రిషి ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడగగా నీకోసమే ఎదురు చూస్తున్నాము నిన్న నువ్వు వసు ని కలిసావు కదా ఏమైంది మీరిద్దరూ ఏమైనా మాట్లాడుకున్నారా అని అనగా మాట్లాడుకున్నాము అని అంటాడు రిషి. అప్పుడు వాళ్ళిద్దరూ సంబర పడిపోతారు మరి నువ్వు వసు చెప్పింది సరే అన్నవా అని అనగా లేదు నేను చెప్పిందే వసుధార సరే అన్నది, చదువుకోమని చెప్పాను.
 

26

పరీక్షలు అయ్యేవరకు మనసులో ఇంకేం పెట్టుకోవద్దు అని చెప్పాను అని అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ, ఇప్పటివరకు నువ్వ మాట్లాడింది చదువు గురించ? అని అంటారు ఇంతట్లో గౌతమ్ ఈ పని ఇంక ఎలా లేదు అనుకొని అక్కడ నుంచి నిరాశ వెళ్ళిపోతాడు. అప్పుడు రిషి మహేంద్ర తో మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలుసు కానీ వాసుదారిని ప్రస్తుతానికి చదువుకోనిద్దాము వసుధారా మనకు దొరికిన అదృష్టం దాన్ని ఎలా వదులుకుంటాను అని అంటాడు. ఆ తర్వాత సీన్లో పుష్ప, వసు ఇద్దరు నడుస్తూ ఉండగా పుష్ప పరీక్షలకి ఏవైనా టిప్స్ చెప్పు వసు అని అడుగుతుంది.
 

36

అప్పుడు వసు ఏం లేదు చదువుకోవడమే గట్టిగా చదువుతూనే మార్కులు వస్తే లేకపోతే ఎగ్జామ్ పోతది అని అంటుంది. అసలు నువ్వు వసుధారవేనా నిద్రపోకూడదు ఎప్పుడు చదువుతూనే ఉండాలి అని చెప్పి నాకు సూత్రాలు చెప్తావు అనుకుంటే ఇలా ఉన్నావేంటి అని అంటుంది పుష్ప. ఇంతలో వాళ్లు నడుస్తున్నప్పుడు రిషి కనిపిస్తాడు ఇద్దరికిద్దరూ మాట్లాడుకోరు ఇలా మాట్లాడుకోకపోవడం ఇంత బాధగా ఉంటుందా అని వసు అనుకుంటుంది. ఇప్పుడు మాట్లాడితే చదువు డిస్ట్రబ్ అవుతదేమో అని రిషి అనుకుంటాడు. కనీసం ఆల్ ది బెస్ట్ అయినా చెప్పాలి కదా సార్ అని మనసులో అనుకుంటుంది వసు.
 

46

రిషి కూడా మనసులో ఆల్ ది బెస్ట్ చెప్తాడు. మాట్లాడకపోయినా కనీసం లిఫ్ట్ ఇవ్వొచ్చు కదా అని వసు అనుకోగా అదే సమయంలో రిషి క్యాబ్ పంపిస్తున్నాను అని వసుకి మెసేజ్ పెడతాడు. జెంటిల్మెన్ సార్ మీరు అని అనుకుంటుంది వసు. ఆ తర్వాత సీన్లో రిషి, గౌతమ్ మహేంద్ర హల్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతట్లో జగతి పుస్తకాలు పట్టుకొని నేను బయలుదేరుతున్నాను అని అంటుంది. ఎక్కడికి బయలుదేరుతున్నారు అని మహేంద్ర అనగా వసుకి ముఖ్యమైన పాఠాలు గురించి నోట్స్ ఇవ్వడానికి వెళ్తున్నాను అని అంటుంది. అప్పుడు నువ్వు కూడా వెళ్లొచ్చు కదా రిషి అని మహేంద్ర అంటాడు.
 

56

ఇంతట్లో రిషి కోపంగా చూసేసరికి గౌతము నువ్వు వెళ్ళు అని అంటాడు. అప్పుడు రిషి నేనే వెళ్తాను అని బయలుదేరుతాడు కానీ ఇంతట్లో డిస్టర్బ్ అవుతుందని గౌతమ్ ని వెళ్ళమంటాడు. మరో వైపు,వసు చదువుతూ రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతట్లో కార్ శబ్దం వినిపించేసరికి రిషి వచ్చాడు అనుకోని తడుపుతీస్తుంది. కానీ అక్కడ జగతి గౌతమ్ లు ఉంటారు రిషి సార్ రాలేదా అని అడగగా మేము వచ్చాము కదా వసు,ఈ సమయంలో నువ్వు ఇలాంటివేం పెట్టుకోవద్దు కేవలం చదువు మాత్రమే ఉండాలి అని అంటుంది. గౌతమ్ కూడా బాగా చదువుకో వసుదారా మీ మీదే అందరూ అసలు పెట్టుకున్నాము అని అంటాడు.
 

66

ఆ తర్వాత సీన్లో రుషికి వసు కాఫీ ఇస్తున్నట్టు రిషి ఊహించుకుంటాడు. నువ్వు కాఫీ తెచ్చావేంటి వసుధార అని అనగా గౌతం, ఏం మాట్లాడుతున్నావ్ రా నేను వసుధార ను కాదు.మనసు ఎక్కడ పెట్టుకున్నావో అని అనగా అక్కడ నుంచి వెళ్లిపోతాడు రిషి.మరో పక్క వసు కూడా రిషిని పక్కనే ఉన్నట్టు ఊహించుకుంటూ ఉంటుంది. ఎందుకు రిషి సార్ నాకు ఇలా గుర్తొస్తున్నారు అని అనుకుంటుంది.ఆ తర్వాత రిషి మెట్ల నుంచి కిందకు దిగుతున్నప్పుడు సోఫాలో వసుధార కూర్చొని ఉంటుంది. మీకోసమే ఎదురుచూస్తున్నాను సార్ అని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!

Recommended Stories