ఆదాయం 14 లక్షలే.. లగ్జరీ ఫ్లాట్లు, కాస్ట్‌లీ కార్లు ఎలా వచ్చాయి రియా?

First Published Aug 13, 2020, 12:26 PM IST

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత రియా చక్రవర్తి పేరు తీవ్ర స్థాయిలో చర్చకు వచ్చింది. రియా కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించటంతో పోలీసులు ఆ దిశగా ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రధానంగా రియా ఆస్తులు మీదే చర్చ జరుగుతోంది.

1992 జూలై 1న బెంగళూరులో జన్మించింది రియా చక్రవర్తి. చిన్నతనం నుంచి గ్లామర్ ఫీల్డ్ మీద ఇంట్రస్ట్‌ ఉండటంతో 2012లో తూనీగా తూనీగా సిల్వర్‌ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. సుశాంత్‌ది బెంగాళీ ఫ్యామిలీ.
undefined
రియా తండ్రి ఆర్మీ డాక్టర్ కావటంతో ఆమె చదువంతా ఆర్మీ స్కూల్‌లోనే సాగింది. రియాకు షోవిక్‌ అనే సోదరుడు కూడా ఉన్నాడు.
undefined
2009లో ఎంటీవీ నిర్వహించిన షోలో రన్నరప్‌గా నిలిచిన రియా గ్లామర్‌ ఫీల్డ్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. తరువాత ఎంటీవీలో వీడియో జాకీగా కూడా సెలెక్ట్ అయ్యింది రియా.
undefined
ఎంటీవీలో వాట్సాప్‌, కాలేజ్‌ బీట్‌, టిక్‌టాక్‌ లాంటి షోస్‌కు వ్యాఖ్యతగా కూడా చేసింది రియా చక్రవర్తి. టెలివిజన్‌ హోస్ట్‌గా పనిచేస్తున్న సమయంలోనే యాక్టింగ్‌ను కెరీర్‌గా తీసుకోవాలని భావించింది రియా.
undefined
ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే తెలుగులో తూనీగ తూనీగ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం రావటంతో చదువుకు గుడ్‌బై చెప్పేసింది ఈ బ్యూటీ.
undefined
2013లో మేరు డాడ్‌కి మారుతి సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రియా. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది.
undefined
2014లో ఆమె నటించిన సోనాలి కేబుల్‌ సినిమా కూడా దారుణంగా ఫ్లాప్‌ కావటంతో మూడేళ్ల పాటు ఈ బ్యూటీకి ఒక్క అవకాశం కూడా రాలేదు.
undefined
2017లో వరుసగా రెండు సినిమాల్లో అవకాశాలు రావటంతో మరోసారి వెండితెర మీద సందడి చేసింది ఈ బ్యూటీ. 2017లో రిలీజ్ అయిన బ్యాంక్‌ చోర్‌, 2018లో రిలీజ్ అయిన జలేబీ సినిమాలో పర్వాలేదనిపించటంతో రియా తిరిగి ఇండస్ట్రీలో కొనసాగింది.
undefined
8 ఏళ్ల కెరీర్‌లో రియా చేసింది కేవలం 7 సినిమాలు మాత్రమే. వీటిల్లో ఒక్క సినిమా కూడా సూపర్‌ హిట్ అనే స్థాయికి రాలేదు. ఇక రియా ఆర్ధిక పరిస్థితిచూస్తే ఇన్‌ కం ట్యాక్స్ రిటర్న్‌ లెక్క ప్రకారం రియా సంవత్సర ఆదాయం కేవలం 14 లక్షల రూపాయలు మాత్రమే.
undefined
ఈ సంపాదనతోనే ఆమె ముంబైలోని కాస్ట్‌లీ ఏరియాలో రెండు ఫ్లాట్స్‌, ఖరీదైన కారు ఎలా కొనుగోలు చేయగలిగింది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమీదే ప్రస్తుతం ఈడీ అధికారులు దృష్టి పెట్టారు.
undefined
click me!