ఈ వరదకి కారణం తుఫాన్ కాదని.. తప్పు ప్రభుత్వాలదే అని ఆరోపిస్తోంది కీర్తి పాండియన్. ఒకప్పుడు ఆ ప్రాంతంలో ఎంత పెద్ద వర్షం పడినా చుక్క నీరు నిలిచేది కాదట. కానీ ఇప్పుడు ఆ చుట్టుపక్కల రోడ్లు ఇష్టానుసారం తవ్వేసి అసంపూర్తిగా వదిలేశారట. దీనితో సరైన డ్రైనేజి వ్యవస్థ లేకపోవడంతో వరద ముంచెత్తింది అని కీర్తి పాండియన్ ఆరోపించింది ఆ దృశ్యాలని కూడా సోషల్ మీడియాలో పంచుకుంది.