వాహ్‌ సూపర్‌ ఉమెన్‌గా రష్మిక మందన్నా.. కొత్త అందాలు అద్దుకుని రచ్చ చేస్తున్న నేషనల్‌ క్రష్‌.. ఫోటోలు వైరల్‌

First Published Jan 27, 2023, 6:30 PM IST

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా హాట్‌ డోస్ పెంచుతూ ఫ్యాన్స్ ని మంత్రముగ్దుల్ని చేస్తుంది. అయితే ఇప్పుడు ఆమె ఉన్నట్టుండి సూపర్‌ఉమెన్‌గా మారిపోయింది. సూపర్‌ హాట్‌ పోజులతో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. 
 

రష్మిక మందన్నా(Rashmika Mandanna) తాజాగా సూపర్‌ హాట్‌గా మారిపోయింది. హాలీవుడ్‌ సినిమాల్లోకి సూపర్‌ ఉమెన్‌గా ఆమె ముస్తాబైంది. ఉబికి వచ్చే అందాలతో సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. తన హాట్‌ అందాలను ఆవిష్కరిస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది రష్మిక మందన్నా. 
 

రష్మిక అందాల మరింత ఘాటెక్కాయి. మరింత అందాన్ని అద్దుకున్నాయి. కలర్‌ ఫుల్‌ అందాలతో మంత్రముగ్దుల్ని చేసేలా ఉన్నాయి. ప్రస్తుతం రష్మిక మందన్నా ఈ నయా ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తూ, నెటిజన్లని ఆశ్చర్యపరుస్తున్నాయి. 

అయితే ఇటీవల వచ్చిన ఓ కొత్త యాప్‌ ద్వారా ఫోటోలను ఇలా కలర్‌ఫుల్‌గా, క్యూట్‌గా, హాట్‌గా, ప్రిన్సెస్‌గా మార్చేస్తున్నారు. హీరోయిన్లు తమ ఫోటోలను ఈ యాప్‌ తో రంగులు అద్దుకుని యానిమేషన్‌ లుక్‌లోకి మారిపోతున్నారు. రకుల్‌,కృతి శెట్టి వంటి చాలా మంది కథానాయికలు దీన్ని వాడుకుని సోషల్‌ మీడియాలో పోస్ట్ లు పెట్టారు. అయితే ఇప్పుడు రష్మిక ఫోటోలు అదే స్టయిల్‌లో హల్‌చల్‌ చేస్తుండటం విశేషం. 
 

కాకపోతే రష్మిక ఫోటోలను ఫ్యాన్స్ ఇలా యానిమేటెడ్‌గా మార్చేశారు. అందాల రాజహంసలా, సూపర్‌ ఉమెన్‌లా తయారు చేశారు. వాటిని ట్విట్టర్‌ ద్వారా పోస్ట్ చేయగా, ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌ అవుతూ సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి. అభిమానులను కట్టిపడేస్తున్నాయి. 
 

ఇందులో రష్మిక అందాలు మరింత హాట్‌గా మారిపోవడం విశేషం. దేవలోకం నుంచి దిగి వచ్చిన అందాల దేవకన్యలా, రాజకుమారిలా కనిపిస్తూ ఎంతో ఆకట్టుకుంటుంది. నెట్టింట రచ్చ చేస్తుంది. ఈ పిక్స్ ని అభిమానులు షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. 

రష్మిక మందన్న ప్రస్తుతం వరుసగా సినిమాలతో బిజీగా ఉంది. ఆమె తెలుగులో `పుష్ప2`లో నటిస్తుంది. వచ్చే నెలలో ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొనబోతుందట. దీంతోపాటు బాలీవుడ్‌లో `యానిమల్‌` చిత్రంలో నటిస్తుంది రష్మిక. ఈ రెండు పాన్‌ ఇండియా మూవీస్‌ కావడం విశేషం. ఇంకోవైపు తమిళంలోనూ ఓ సినిమా చేస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. 
 

ఇదిలా ఉంటే ఇటీవల తరచూ రష్మిక వివాదాల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. దీంతో ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. తను కమ్యూనికేట్ చేయడం రాదని, దానివల్లే అపార్థం చేసుకుంటున్నారని, అయితే ఎందుకు వివాదం చేస్తున్నారో అర్థం కావడం లేదని తెలిపింది. చెప్పాల్సిన ఆన్సర్‌ కంటే ఎక్కువగా మాట్లాడటం వల్లే ఈ వివాదాలు క్రియేట్‌ అవుతున్నాయేమో అని చెప్పింది రష్మిక. అలాగే సౌత్‌ సినిమాలు మాస్‌ మాసాలా అనేదానిపై కూడా ఆమె రియాక్ట్ అయ్యింది. తన ఉద్దేశ్యం వేరని, అది చెప్పేలోపే కట్‌ చేశారని, దీంతో చెప్పలేకపోయానని తెలిపింది రష్మిక. 
 

click me!