అంత సులువైన విషయం కాదు..
ఇంతటి గొప్ప లెజెండ్ను వెండితెరపైకి తీసుకురావడం అంత సులువైన విషయం కాదు. దీని వెనుక ఎంతో శ్రమ, ఓపిక ఉన్నాయి. ఆమె కథను అంతే నిజాయితీగా, గౌరవంగా చూపించడానికి కావాల్సిన హక్కులు, అనుమతులు, ఆధారాలు, కుటుంబ సభ్యుల అంగీకారం కోసం చిత్ర బృందం ఏళ్ల తరబడి కష్టపడింది.
ఎంఎస్ సుబ్బులక్ష్మి గొప్ప జీవితాన్ని, ఆమె వారసత్వాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు చేర్చాలనే ఉద్దేశంతో అల్లు అరవింద్, రాక్లైన్ వెంకటేష్, బన్నీ వాసు లాంటి ముగ్గురు అగ్ర నిర్మాతలు చేతులు కలిపారు. గౌతమ్ తిన్ననూరి తనదైన శైలిలో ఈ స్ఫూర్తిదాయకమైన కథను తెరకెక్కించనున్నాడు. పీఆర్వో: ఆతిరా దిల్జిత్.