
సాయిపల్లవి ఎంత్తైనా బ్యూటీఫుల్ యాక్టర్. అయితే ఇతర హీరోయిన్ల అంత కాకపోయినా సహజంగా ఉంటుంది. ఆమె అందమే కాదు, మాట, నటన కూడా అంతే సహజంగా ఉంటుంది. నిజాయితీగా ఉంటుంది. డాన్సు చేస్తే కుర్రాళ్లకి పిచ్చెక్కిపోవాల్సిందే. అద్బుతమైన డాన్సులతో ఫిదా చేస్తుంది. `లవ్ స్టోరీ` చిత్రంలో ఆమె చేసిన డాన్సులకు విశేష ప్రశంసలు దక్కాయి. అంతేకాదు చిరంజీవి సైతం సాయిపల్లవితో డాన్సు చేయాలని ఉందని తన కోరికని వెల్లడించారంటే సాయిపల్లవి రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఇవన్నీ సాయిపల్లవిని టాప్ పొజిషిన్లో నిలిపాయి. దీనికి తోడు ఆమె కమర్షియల్ యాడ్ కూడా రిజక్ట్ చేసిందట. అలా చేయాలంటే గొప్ప మనసు ఉండాలని, తనలో గొప్ప మానవత్వం ఉందని ప్రశంసించారు సుకుమార్. ఆదివారం రాత్రి జరిగిన `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్లో గెస్ట్ గా వచ్చిన సుకుమార్ ఈ విషయాన్ని చెప్పి ఆమెని ఆకాశానికి ఎత్తేశాడు. గొప్ప నటి అంటూ కొనియాడారు.
అయితే ఇందులోనే సాయిపల్లవి గురించి సుకుమార్ చెప్పేముందు ఆడియెన్స్ విపరీతంగా అరుస్తూ కేకలు పెట్టడం విశేషం. సాయిపల్లవికి ఉన్న ఇమేజ్ని, క్రేజ్ని అభిమానులు అలా గట్టిగా అరుస్తూ హోరెత్తించారు. దీనికి స్టేజ్పై ఉన్న అంతా షాక్ అయ్యారు. దర్శకుడు సుకుమార్ కూడా కాసేపు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ వారి అరుపులను చూసి `ఐ థింక్ లేడీ పవన్ కళ్యాణ్అనుకుంటా` అంటూ స్టేట్మెంట్ ఇవ్వడం ఇప్పుడు ఇంటర్నెట్లో దుమ్మురేపుతుంది. దీనిపై నెటిజన్లు మీమ్స్ చేసి సాయిపల్లవిని ట్రెండ్ చేస్తున్నారు. ఆమె రేంజ్ని తెలియజేస్తున్నారు.
అయితే ఇక్కడే ఇద్దరు స్టార్ హీరోయిన్లకి అసూయ పుట్టించింది. స్టేజ్పై ఉన్న కీర్తిసురేష్, రష్మిక మందన్నాలు కూడా సాయిపల్లవికి ఉన్న క్రేజ్ని చూసి షాక్కి గురయ్యారు. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు.
కానీ ఈ విషయంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తెలివిగా తప్పించుకుంది. సాయిపల్లవి పేరు చెప్పినప్పుడు అభిమానులు అరుస్తున్న విధానాన్ని నవ్వుతో కవర్ చేసుకుంది. కెమెరా కళ్లు ఆమెనే ఫోకస్ చేస్తున్న నేపథ్యంలో తనలోపలి జెలసీని బయట పడకుండా కవర్ చేసుకుంది. సేఫ్ జోన్లోకి వెళ్లిపోయింది. తాజాగా ఈ విషయం గురించి మాట్లాడుతూ సాయిపల్లవి ఇంత తక్కువ సమయంలో ఆ స్థాయి ఇమేజ్ని, క్రేజ్ని సొంతం చేసుకోవడం గొప్ప విషయమని ప్రశంసించింది.
ఈ విషయంలో మాత్రం `మహానటి` కీర్తిసురేష్ అడ్డంగా బుక్కయ్యింది. సాయిపల్లవి కోసం ఆడియెన్స్ అరుస్తుండగా, మొదట స్మైల్ ఫేస్తో కనిపించిన కీర్తి.. ఆ తర్వాత ఆమె ఫేస్లో ఎక్స్ ప్రెషన్స్ మారిపోయాయి. జెలసీ ఫీలింగ్లోకి వెళ్లిపోయింది. ఈ వీడియోలను, ఫోటోలను క్యాప్చర్ చేసిన నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
సాయిపల్లవి క్రేజ్కి కీర్తిసురేష్ జెలసీగా ఫీలవుతుందంటూ, తట్టుకోలేకపోయారంటూ ఆయా వీడియోలను, ఫోటోలను మీమ్స్ రూపంలో షేర్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. సాయిపల్లవి ముందు కీర్తి అడ్డంగా దొరికిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు నెట్టింట పెద్ద రచ్చగా మారడం గమనార్హం.
ఇటీవల `లవ్ స్టోరి`, `శ్యామ్ సింగరాయ్` సక్సెస్లో ఫుల్ జోష్లో ఉంది సాయిపల్లవి. ఈ రెండు చిత్రాల్లో ఆమె నటనకు, డాన్సులకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం సాయిపల్లవి `విరాటపర్వం`లో నటిస్తుంది. అలాగే విజయ్తో తెలుగు సినిమా, శివకార్తికేయన్తో ఓ సినిమా చేస్తుంది. కీర్తిసురేష్ `సర్కారు వారి పాట`, `భోళాశంకర్`, `దసరా` చిత్రాలు చేస్తుంది. తమిళంలో ఓ చిత్రం, మలయాళంలో మరో సినిమాలో నటిస్తుంది.