`పిచ్చెక్కిపోవాల్సిందే`.. `పుష్ప2`, `యానిమల్‌`, ధనుష్‌ చిత్రాలపై రష్మిక మందన్నా కామెంట్‌ వైరల్‌..

Published : Sep 01, 2023, 05:22 PM IST

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ప్రస్తుతం రెండు భారీ చిత్రాలతో బిజీగా ఉంది. రెండూ పాన్‌ ఇండియా మూవీస్‌. దీనికి ఇటీవల మరో సినిమా తోడైంది. దీంతో బ్యాక్‌ టూ బ్యాక్‌ దుమ్మరేపేందుకు వస్తుంది.   

PREV
16
`పిచ్చెక్కిపోవాల్సిందే`.. `పుష్ప2`, `యానిమల్‌`, ధనుష్‌ చిత్రాలపై రష్మిక మందన్నా కామెంట్‌ వైరల్‌..

రష్మిక మందన్నా.. గ్లామర్‌ తారగా టర్న్ తీసుకుంటుంది. నిజానికి ఈ బ్యూటీ మంచి నటి కూడా. అద్బుతమైన నటనతో మెస్మరైజ్‌ చేసింది. హవాభావాలు, డైలాగు డెలివరీ, యాక్టింగ్‌ చాలా బాగుంటుంది. చాలా మంది హీరోయిన్ల కంటే బెటర్‌గా చేస్తుంది. అందుకే ఈ బ్యూటీ గ్లామర్‌ పాత్రలతోపాటు నటనకు స్కోప్‌ ఉన్న పాత్రలు, అలాంటి సినిమాలొస్తున్నాయి. `పుష్ప` సినిమానే అందుకు నిదర్శనం.
 

26

అనతి కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది రష్మిక మందన్నా. నేషనల్‌ క్రష్‌ నుంచి పాన్ ఇండియా క్రష్‌గా మారింది. ఇప్పుడు వరుసగా పాన్‌ ఇండియా సినిమాలతో అలరించేందుకు రాబోతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో అల్లు అర్జున్‌తో `పుష్ప2` చిత్రం చేస్తుంది. శ్రీవల్లిగా అలరించేందుకు వస్తుంది. మొదటి భాగంలో ఇప్పటికే రచ్చ చేసింది. ఎంతో మందిని ఆకట్టుకుంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో `పుష్ప2`తో రాబోతుంది. ఈ చిత్రంతో మరోసారి రచ్చ చేసేందుకు సిద్ధమవుతుంది నేషనల్‌ క్రష్‌. 

36

దీంతోపాటు బాలీవుడ్‌లో `యానిమల్‌` సినిమా చేస్తుంది. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ దుమ్ములేపుతుంది. సినిమాపై అంచనాలను పెంచేసింది. ఏదో కొత్త పాయింట్‌తో ఈ సినిమా రాబోతుందని అర్థమవుతుంది. ఇది పాన్ ఇండియా మూవీనే. ఇది డిసెంబర్‌లో రాబోతుంది.
 

46
Rashmika Mandanna

మరోవైపు రష్మిక మందన్నా ఇటీవల `ధనుష్‌` సినిమాకి ఓకే చెప్పింది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. వచ్చే ఏడాది ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఇందులో నాగార్జున కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్ర కథ కూడా అదిరిపోయేలా ఉంటుందట. యాక్షన్‌ ప్రధానంగా సాగుతుందని, ఓ కొత్త కాన్సెప్ట్ తో సాగుతుందని, ఊహించని విధంగా ఉంటుందని అంటున్నారు. 
 

56
Rashmika Mandanna

తాజాగా ఈ చిత్రాలపై రష్మిక మందన్నా స్పందించింది. ఈ మూడు సినిమాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పింది. మూడు చిత్రాలకు ఉన్న ఓ కామన్‌ థ్రెడ్‌ని బయటపెట్టింది. ఓ నెటిజన్ ట్విట్టర్‌ ఈ బ్యూటీని ప్రశ్నించింది. `పుష్ప2`, `యానిమల్‌`, `డీ51` చిత్రాలకు సంబంధించిన ఏదైనా అప్‌డేట్‌ ఇవ్వాలని నెటిజన్ ప్రశ్నించగా.. అన్నింటికి కలిపి ఓ కామన్‌ త్రెడ్‌ ఉందంటూ `ఇవి పిచ్చెక్కించేలా ఉంటాయి` అని పేర్కొంది రష్మిక. దీంతో ఈ బ్యూటీ ట్వీట్‌ ట్రెండ్‌ అవుతుంది. ఈ మూడు చిత్రాలు ఆడియెన్స్ కి మెంటల్‌ ఎక్కించే రేంజ్‌లో ఉంటాయని ఆమె పేర్కొంది.

66
Rashmika mandanna

ఇదిలా ఉంటే రష్మిక వీటితోపాటు `రెయిన్‌బో` అనే సినిమాలో నటిస్తుంది. ఇది లేడీ ఓరియెంటెడ్‌ మూవీ. మరోవైపు తెలుగులో నితిన్‌తో సినిమా చేయాల్సింది. హిందీలో వరుణ్‌ ధావన్‌ సినిమా కోసం ఇది వదులుకుందట. కానీ ఆ సినిమా రద్దు అయ్యింది. దీంతో ఈ రెండూ పోయాయి. కొత్త ఆఫర్ల కోసం వెయిట్‌ చేస్తుంది నేషనల్‌ క్రష్‌.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories