రమ్యకృష్ణ అంటే భయం, సౌందర్య, త్రిష ఇష్టం.. కానీ ఆ హీరోయిన్లకి యాటిట్యూడ్‌ ఉంటుంది.. రంభ కామెంట్స్ వైరల్

First Published Jun 29, 2024, 9:28 AM IST

ఒకప్పటి గ్లామర్‌ బ్యూటీ రంభ.. ఇప్పటికీ తన స్పెషల్‌ సాంగ్‌లతో, గ్లామర్‌ పాత్రలతో అలరిస్తూనే ఉంది. అయితే ఆమె హీరోయిన్లపై హాట్‌ కామెంట్‌ చేసింది. 
 

గ్లామర్‌ బ్యూటీ సౌత్‌, నార్త్ ఇండస్ట్రీలను ఊపేసిన నటి రంభ. ఆమె సినిమాల్లో గ్లామర్‌ పాత్రలే కాదు, ఐటెమ్స్ సాంగ్స్ ల్లోనూ దుమ్మురేపింది. ఒకప్పుడు ఆయా పాటలకు స్పెషల్‌ క్రేజ్‌ని తీసుకొచ్చింది రంభ. పదేళ్ల పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలోనూ నటించి మెప్పించింది. ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితమయ్యింది. 

ఇదిలా ఉంటే రంభ.. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఆ హీరోయిన్లకి యాటిట్యూడ్‌ ఉంటుందని, చూసినా చూడనట్టు వెళ్లిపోతారని చెప్పి షాకిచ్చింది. ఈ సందర్భంగా రమ్యకృష్ణ, సౌందర్యలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో తనకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే అది సౌందర్య అని చెప్పింది. అప్పట్లో ఫ్రెండ్‌గా ఉన్న వారిలో ఆమెనే క్లోజ్‌గా ఉండేదని, సౌందర్య అంటే తనకు ఇష్టమని చెప్పింది. అలాగే మహేశ్వరీ కూడా తనకు మంచిస్నేహితురాలు అని చెప్పింది. 
 

మరీ క్లోజ్‌ ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరని, ఉన్న వారిలో వీరితోనే క్లోజ్‌గా మూవ్ అవుతానని పేర్కొంది రంభ. మరోవైపు నటనలో పోటీగా భావించింది ఎవరిని అంటే.. రమ్యకృష్ణ పేరు చెప్పింది రంభ. ఆమెతో సినిమా చేస్తుంటే చాలా భయంగా ఉంటుందని, ఆమె ఎలాంటి సీన్‌ అయినా, డైలాగ్‌ అని ఇట్టే చెసేస్తుంది. ఆమెతో పోల్చితే జూనియర్‌ కావడంతో రమ్యకృష్ణ ముందు నటించాలంటే భయంగా అనిపించేదని చెప్పింది రంభ. 
 

actress trisha

ఇప్పుడున్న జనరేషన్‌లో ఎవరంటే ఇష్టమనే ప్రశ్న ఎదురైంది. నయనతార, త్రిష, ఇలియానా, కాజల్‌ పేర్లు చెప్పగా, త్రిష అంటే ఇష్టమని చెప్పింది. ఆమెని రెండు మూడు సార్లు కలిశాను అని, చాలా ఎఫెక్షన్‌తో మాట్లాడుతుందని చెప్పింది రంభ. కానీ మిగిలిన వాళ్లు అలా ఉండరు. కనిపించినా, చూడనట్టుగా వెళ్లిపోతారని వెల్లడించింది రంభ. 

రంభ 1992లో `ఆ ఒక్కటి అడక్కు` చిత్రంతో తెలుగు తెరకి హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. రాజేంద్రప్రసాద్‌ సరసన నటించింది. `ఏవండి ఆవిడ వచ్చింది`, `తొలి ముద్దు`, `రౌడీ అన్నయ్య`, `ముద్దుల ప్రియుడు`, `అల్లరి ప్రేమికుడు`, `అల్లుడా మజాకా`, `బొంబాయి ప్రియుడు`, `హిట్లర్‌`, `గణేష్‌`, `బావగారు బాగున్నారా?` వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది రంభ. ఆ తర్వాత ఐటెమ్ సాంగ్స్ తో ఊపేసింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా విదేశాల్లో పిల్లలు, ఫ్యామిలీకే పరిమితయ్యింది. అడపాదడపా సోషల్‌ మీడియాలో ఫోటోలతో అభిమానులను అలరిస్తుంది రంభ.  

Latest Videos

click me!