ఎలక్షన్ సమయంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం వ్యూహం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన సమయం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు 'వ్యూహం' చిత్రాన్ని తెరకెక్కించారు వర్మ.
రిలీజ్ కు ముందు ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి కానీ సినిమా వర్కవుట్ కాలేదు. అందుకు రకరకాల కారణాలు ఉన్నా,సినిమా బాగోలేదనేది నిజం. అది ప్రక్కన పెడితే ఇప్పుడు వ్యూహం చిత్రం మరోసారి వార్తలకు ఎక్కింది. ఈ సినిమా విషయంలో అక్రమాలు జరిగాయని చెప్తున్నారు.