రాంచరణ్ నటించిన పెద్ది మూవీ అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ థాంక్యూ మీట్ నిర్వహించారు. రాంచరణ్ పెద్ది సక్సెస్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
రాంచరణ్ నటించిన పెద్ది చిత్రం బాక్సాఫీస్ వద్ద అన్ స్టాపబుల్ గా దూసుకుపోతోంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాకి అద్భుతమైన స్పందన దక్కుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ అదిరిపోతున్నాయి. నాలుగు రోజుల్లో కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే పెద్ది చిత్రం 108 కోట్ల వరకు షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్ గా 150 కోట్ల షేర్ కు చేరువైంది. దీనితో చిత్ర యూనిట్ తాజాగా థాంక్యూ మీట్ నిర్వహించారు.
25
నేను ఇష్టపడి చేశా
ఈ థాంక్యూ మీట్ కి రాంచరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు, నిర్మాతలు హాజరయ్యారు. రాంచరణ్ థాంక్యూ మీట్ లో పెద్ది సక్సెస్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెద్ది లాంటి సినిమా చేయమని నన్ను ఎవరూ బలవంతం చేయలేదు. నాకు నేను స్వతహాగా నిర్ణయించుకుని చేశా. నేను ఇష్టపడి చేసిన పనికి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుండడంతో నా సంతోషం మాటల్లో చెప్పలేకున్నా. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు చెబుతున్నా అని రాంచరణ్ అన్నారు.
35
క్లాస్ థియేటర్ లో మాస్ రచ్చ
ప్రసాద్ ఐమాక్స్ లో ఈ సినిమా చూశా. క్లాస్ థియేటర్ కదా, ఆడియన్స్ సైలెంట్ గా ఉంటారని అనుకున్నా. కానీ సింగిల్ స్క్రీన్ తరహాలో గోల చేస్తూ ప్రతి సీన్ కి క్లాప్స్ కొడుతున్నారు. బుచ్చిబాబు ఈ కథని చెప్పినప్పుడు మనస్ఫూర్తిగా అతడిని హగ్ చేసుకున్నా.
కానీ ఇది చాలా రిస్క్ తో కూడుకున్న కథ అని ఆ తర్వాత అర్థం అయింది. ఈ సినిమా హిట్ లేదా ఫ్లాప్ ఏమైనా కావచ్చు అని అనుకున్నా. కానీ ఇప్పుడు ఆడియన్స్ రియాక్షన్స్ చూస్తుంటే.. మనస్ఫూర్తిగా ఎవరైనా సరే స్వచ్ఛమైన మనసుతో కష్టపడి పని చేస్తే సక్సెస్ దక్కాల్సిందే. అది పెద్ది చిత్రంతో ప్రూవ్ అయింది అని రాంచరణ్ అన్నారు.
55
అలాంటి గ్రామాల్లో ఉండేవారి కథే ఇది
డైరెక్టర్ బుచ్చిబాబు మాట్లాడుతూ ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. నిజాయతీయగా ఒక కథ చెప్పాలని అనుకున్నా. ఇండియాతో కనెక్షన్ లేకుండా ఎన్నో గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో ప్రతిభావంతులు ఎందరో ఉన్నారు. గ్రామాల్లో అలవోకగా బరువైన బస్తాలు మోసే వ్యక్తులని చూశాను. వాళ్ళు ఇండియా తరుపున వెయిట్ లిఫ్టింగ్ లో పాల్గొంటే మెడల్ తీసుకువస్తారు కదా అని అనిపించేది. అదే విధంగా సముద్రంలో ఎలాంటి సేఫ్టీ లేకుండా ఈదే ఈతగాళ్ళని చూశాను. వాళ్ళందరి కథే ఈ పెద్ది చిత్రం అని బుచ్చిబాబు అన్నారు.