కియారా పెళ్ళికి రాంచరణ్ గైర్హాజరు.. ఉపాసన క్షమించమని కోరుతూ..

First Published Feb 8, 2023, 12:41 PM IST

బాలీవుడ్ ప్రేమ జంట కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా వివాహ  బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్ లో వీరి వివాహ వేడుక వైభవంగా జరిగింది.

బాలీవుడ్ ప్రేమ జంట కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా వివాహ  బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్ లో వీరి వివాహ వేడుక వైభవంగా జరిగింది. సిద్దార్థ్, కియారా ఇద్దరూ తమ పెళ్లి ఫోటోలని షేర్ చేస్తూ.. ఈ మధురమైన క్షణాలని అభిమానులతో పంచుకున్నారు. 

సిద్ధార్థ్, కియారా అద్వానీ చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు. తమ పెళ్ళికి కుటుంబ సభ్యులు కూడా అంగీకారం తెలపడంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు. అభిమానులు, సీలెబ్రిటీలు వరుసగా కియారా, సిద్దార్థ్ కి శుభాకాంక్షలు చెబుతున్నారు. కియారా తన పెళ్లి ఫోటోలు పోస్ట్ చేయగానే కామెంట్స్ మోతెక్కాయి. 

కియారా అద్వానీ, సిద్ధార్థ్ తమ వివాహానికి చాలా మంది సెలెబ్రిటీలని ఆహ్వానించారు. టాలీవుడ్ నుంచి కియారా మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని తన పెళ్ళికి ఇన్వైట్ చేసింది. రాంచరణ్ తో పాటు  కరణ్ జోహార్, షాహిద్ కపూర్ మియా కపూర్ దంపతులు, వరుణ్ ధావన్, విక్కీ కౌశల్ కత్రినా కైఫ్ దంపతులు, రకుల్ ప్రీత్ సింగ్.. జాకీ భగ్నానీ జోడికి కూడా ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. 

అయితే రాంచరణ్ కియారా అద్వానీ పెళ్ళికి డుమ్మా కొట్టాడు. ప్రస్తుతం వీరిద్దరూ శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కియారా పెళ్లి ఫోటోలపై ఉపాసన స్పందిస్తూ.. కొత్త జంటకి శుభాకాంక్షలు తెలిపింది. కంగ్రాట్స్.. మీరిద్దరూ చాలా అందంగా ఉన్నారు. మేము రాలేకపోయినందుకు క్షమించండి' అంటూ కామెంట్స్ పెట్టింది. ఉపాసన చేసిన కామెంట్ వైరల్ గా మారింది. 

వివిధ కారణాల వల్ల చరణ్, ఉపాసన దంపతులు కియారా వివాహానికి హాజరు కాలేదు. ఉపాసన ప్రస్తుతం గర్భవతిగా ఉన్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ తెలుగులో ఇప్పటికే భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆర్సీ 15లో నటిస్తోంది. 

కియారా, సిద్ధార్థ్ త్వరలో ఢిల్లీ, ముంబై లో రెండు రిసెప్షన్ పార్టీలు ప్లాన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పార్టీలకి సినీ రాజకీయ ప్రముఖులు పెద్దఎత్తున హాజరు కానున్నారు. 

click me!