ఆ నిర్మాతలు మైత్రి వాళ్ళని చూసి నేర్చుకోవాలి.. రాంచరణ్ వార్నింగ్ ఎవరికి, తండ్రీకొడుకులు ఏసుకుంటున్నారుగా

First Published Jan 29, 2023, 1:06 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం ఈ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. దర్శకుడు బాబీ మెగాస్టార్ అభిమానులకు ఎలాంటి అంశాలు కోరుకుంటారో వాటితోనే ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం ఈ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. దర్శకుడు బాబీ మెగాస్టార్ అభిమానులకు ఎలాంటి అంశాలు కోరుకుంటారో వాటితోనే ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేశారు. క్రిటిక్స్ రివ్యూలు మిక్స్డ్ గా ఉన్నప్పటికీ మెగాస్టార్ బాక్సాఫీస్ జోరు ఆగలేదు. 

తనకు పడాల్సిన చిత్రం పడితే వసూళ్ల వరద ఎలా ఉంటుందో చూపించారు.  వాల్తేరు వీరయ్య చిత్రం రెండు వారాల్లోనే 200 కోట్ల గ్రాస్ అధికమించింది. 125 కోట్లకి పైగా షేర్ తో దూసుకుపోతోంది. బయ్యర్లు అంతా కళ్ళు చెదిరేలాభాలు అందుకుంటున్నారు. దీనితో మైత్రి నిర్మాతలు శనివారం రోజు వరంగల్ లో వాల్తేరు వీరయ్య గ్రాండ్ సక్సెస్ మీట్ నిర్వహించారు. వీరయ్య విజయ విహారం పేరుతో నిర్వహించిన ఈ సక్సెస్ సెలబ్రేషన్ విజయవంతం అయ్యాయి. 

ఎర్రబెల్లి దయాకరరావు లాంటి రాజకీయ ప్రముఖులు ఈ ఈవెంట్ కి అతిథులుగా హాజరయ్యారు. చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా అతిథిగా హాజరు కావడం విశేషం. ఈ వేడుకలో రాంచరణ్ చేసిన పలు వ్యాఖ్యలు ఇండస్ట్రీలో, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా నిలిచాయి. మైత్రి నిర్మాతల గురించి రాంచరణ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ డిస్కషన్ గా మారింది. 

Image: Getty Images

మా బ్లాక్ బస్టర్ నిర్మాతలు నవీన్, రవి గారికి కంగ్రాట్స్. నాకు రంగస్థలం లాంటి గ్రేట్ మెమొరబుల్ ఫిలిం ఇచ్చారు. మైత్రి సంస్థలో పని చేసిన ప్రతి హీరోకి మెమొరబుల్ ఫిలిమ్స్ దక్కాయి. ఆ ఘనత సాధించిన ఏకైక సంస్థ మైత్రి. మైత్రి నిర్మాతలు నవీన్, రవిగారు నేరుగా ఇండస్ట్రీలోకి రాలేదు. వివిధ వ్యాపారాలు చేసుకుంటూ తెలుగు మాస్ సినిమాపై ప్రేమతో వచ్చారు. 

వీళ్ళకి టాలీవుడ్ రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ కన్నా ఎక్కువ కమిట్మెంట్ ఉంది. మైత్రి నిర్మాతలని చూసి ఈ మధ్య కాలంలో ఉన్న ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్స్ నేర్చుకోవాలి అంటూ రాంచరణ్ బాంబ్ పేల్చారు. మైత్రి వాళ్ళు దమ్మున్న నిర్మాతలు.రాంచరణ్ ఇచ్చిన ఇన్ డైరెక్ట్ వార్నింగ్ ఎవరికి ? ఈ మధ్య కాలంలో అనే ఆ నిర్మాతలు ఎవరు ? మైత్రిని చూసి వాళ్ళు చేరుకోవాల్సింది ఏంటి ? అంటూ హాట్ హాట్ డిస్కషన్ జరుగుతోంది. 

తాను వర్క్ చేసిన నిర్మాతల గురించే చరణ్ ఇలా అన్నాడా లేక ఇతరుల గురించా అనేది కూడా తెలియదు. రాంచరణ్ చివరగా వినయవిధేయ రామ, ఆర్ఆర్ఆర్, ఆచార్య చిత్రాల్లో నటించారు. ఇప్పుడు దిల్ రాజు నిర్మాణంలో శంకర్ చిత్రం తెరకెక్కుతోంది. ఆచార్య ఫెయిల్యూర్ పై చిరు ఇటీవల కొరటాలపై కౌంటర్లు వేయడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు రాంచరణ్ నిర్మాతలని టార్గెట్ చేశారు. 

సంక్రాంతి చిత్రాల విషయంలో దిల్ రాజు వివాదంలో నిలిచారు. మైత్రి వాళ్ళు దమ్మున్న నిర్మాతలు..వాళ్ళని చూసి ఇద్దరు ముగ్గురు నేర్చుకోవాలి అనే చరణ్ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించో అనేది ప్రశ్నపై ఎవరి ఊహాగానాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చిరు డైరెక్టర్లని, చరణ్ నిర్మాతలని ఏసుకుంటున్నారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

click me!