Ram Charan: రామ్‌ చరణ్‌ చివరి 5 సినిమాల్లో హిట్లు ఎన్ని? ఫ్లాపులు ఎన్ని?.. బాక్సాఫీస్ రిపోర్ట్

Published : May 20, 2026, 06:56 AM IST

Ram Charan:  రామ్‌ చరణ్‌ `పెద్ది` సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ విడుదలైంది. దీనికి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా, రామ్ చరణ్ నటించిన చివరి 5 సినిమాల బాక్సాఫీస్ రిపోర్ట్ చూద్దాం. 

PREV
16
రామ్ చరణ్ చివరి 5 సినిమాల పరిస్థితి

రామ్‌ చరణ్‌ `పెద్ది`తో సందడి చేయబోతున్నారు. చివరి మూవీ `గేమ్‌ ఛేంజర్‌` డిజప్పాయింట్‌ చేయడంతో `పెద్ది`తో ఎలాగైనా ఆకట్టుకోవాలని, ఆ లోటుని భర్తీ చేయాలని తపనతో ఉన్నారు. ఈ క్రమంలో మరి రామ్‌ చరణ్‌ నటించిన చివరి 5 సినిమాలు ఏంటి? వాటి బాక్సాఫీసు రిజల్ట్ ఏంటనేది చూస్తే. 

26
1. సినిమా రంగస్థలం

సుకుమార్ దర్శకత్వంలో 2018లో 'రంగస్థలం' అనే పీరియడ్ యాక్షన్ డ్రామా వచ్చింది. ఇందులో రామ్ చరణ్, సమంత జంటగా నటించగా, జగపతి బాబు, నరేష్, ప్రకాష్ రాజ్, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషించారు. రూ.60 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా రూ.216 కోట్లు వసూలు చేసి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అప్పటి వరకు ఇది రీజనల్‌ ఫిల్మ్స్ లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. 

36
2. సినిమా వినయ విధేయ రామ
బోయపాటి శ్రీను దర్శకత్వంలో 2019లో 'వినయ విధేయ రామ' అనే యాక్షన్ డ్రామా సినిమా వచ్చింది. ఈ చిత్రంలో రామ్ చరణ్, వివేక్ ఒబెరాయ్, కియారా అద్వానీ, ప్రశాంత్ ప్రధాన పాత్రల్లో నటించారు. రూ.75 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ.94 కోట్లు వసూలు చేసి ఫ్లాప్‌గా మిగిలింది.
46
3. సినిమా ఆర్ఆర్ఆర్
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో 2022లో వచ్చిన యాక్షన్ డ్రామా 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు అజయ్ దేవగన్, అలియా భట్, శ్రియా శరన్ ముఖ్య పాత్రల్లో నటించారు. రూ.550 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1387 కోట్లు వసూలు చేసి ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
56
4. ఆచార్య
కొరటాల శివ దర్శకత్వంలో 2022లో వచ్చిన యాక్షన్ డ్రామా 'ఆచార్య'. ఈ సినిమాలో చిరంజీవి, పూజా హెగ్డే, సోనూ సూద్, జిస్సు సేన్‌గుప్తా ప్రధాన పాత్రల్లో నటించారు. రామ్ చరణ్ ఒక ముఖ్య పాత్ర పోషించారు. రూ.140 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా కేవలం రూ.78 కోట్లు మాత్రమే వసూలు చేసి డిజాస్టర్‌గా నిలిచింది.
66
5. సినిమా గేమ్ ఛేంజర్

రామ్‌ చరణ్‌ చివరగా నటించిన మూవీ `గేమ్‌ ఛేంజర్‌`.  శంకర్ దర్శకత్వంలో  పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ 2025 సంక్రాంతికి విడుదలైంది. ఇందులో కియారా అద్వానీ, అంజలి, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరామ్ ముఖ్య పాత్రలు పోషించారు. రూ.500 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా రూ.195 కోట్లు వసూలు చేసి డిజాస్టర్‌గా నిలిచింది. చివరి ఐదు మూవీస్‌లో రెండు చిత్రాలు మాత్రమే హిట్‌ అయ్యాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories