తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

`రంగస్థలం`ని మించి, రాసిపెట్టుకోండి.. `పెద్ది` మూవీపై రామ్‌ చరణ్‌ గూస్‌ బంమ్స్ అప్‌ డేట్‌

Aithagoni Raju | Published : May 13, 2025 6:40 PM

రామ్‌ చరణ్‌ నటిస్తున్న `పెద్ది` మూవీకి సంబంధించిన అప్‌ డేట్‌ వచ్చింది. `రంగస్థలం` ని మించి ఉండబోతుందంటూ రామ్‌ చరణ్‌ చేసిన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి.   

15
`రంగస్థలం`ని మించి, రాసిపెట్టుకోండి.. `పెద్ది` మూవీపై రామ్‌ చరణ్‌ గూస్‌ బంమ్స్ అప్‌ డేట్‌
Ram Charan

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం `పెద్ది` సినిమాలో నటిస్తున్నారు. `ఉప్పెన` ఫేమ్‌ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఆ మధ్య సినిమా షూటింగ్‌ ప్రారంభమై ఇప్పటికే రెండు మూడు షెడ్యూల్స్ కూడా కంప్లీట్‌ చేసుకుంది. త్వరలో మరో షెడ్యూల్‌ని ప్రారంభించబోతున్నారు.

25
peddi, ram charan

ఆ మధ్య చరణ్‌ బర్త్ డే సందర్భంగా `పెద్ది` గ్లింప్స్ విడుదలైంది. రామ్‌ చరణ్‌ నటిస్తున్న పాత్ర తీరుతెన్నులను ఆవిష్కరిస్తూ పవర్‌ఫుల్‌గా ఈ మూవీ గ్లింప్స్ ని విడుదల చేశారు. ఉత్తరాంధ్ర యాసలో రామ్‌ చరణ్‌ చెప్పిన డైలాగులు, అలాగే ఆయన గెటప్‌ షాకిచ్చేలా ఉంది. సినిమాపై అంచనాలను పెంచింది. 
 

35
actor ram charan movie Peddi

తాజాగా రామ్‌ చరణ్‌ మరింతగా అంచనాలు పెంచారు. `పెద్ది` సినిమాకి సంబంధించిన గూస్‌ బంమ్స్ అప్‌ డేట్‌ ఇచ్చారు. ఈ మూవీ 30 శాతం షూటింగ్‌ అయిపోయిందని, ఇప్పటి వరకు ఔట్‌పుట్‌ చూస్తే అదిరిపోయిందని, చాలా బాగా వస్తుందని చెప్పారు. కంటెంట్‌ పరంగా తాను చాలా సాటిస్పై ఉండటమే కాదు, ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే విషయం చెప్పారు చరణ్‌. 

45
Ram Charan

రామ్‌ చరణ్‌ కెరీర్‌లో బెస్ట్ మూవీ అంటే `రంగస్థలం` అనే చెబుతారు. నటుడిగా ఆయన్ని ఆవిష్కరించిన మూవీ. కెరీర్‌ బెస్ట్ హిట్‌ గా నిలిచింది. అప్పటి వరకు ఉన్న నాన్‌ `బాహుబలి` రికార్డులను బ్రేక్‌ చేసింది.

అయితే ఇప్పుడు `పెద్ది` సినిమా `రంగస్థలం`ని మించి ఉండబోతుందంటూ కామెంట్‌ చేశారు చరణ్‌. కాన్వాస్‌ పరంగా, ఎమోషనల్‌ డెప్త్ పరంగా నెక్ట్స్ లెవల్‌లో ఉండబోతుందని, ఈ విషయంలో తాను హామీ ఇవ్వగలనని తెలిపారు. బాక్సాఫీసు వద్ద పెద్ద రేంజ్‌ హిట్‌ కాబోతుందన్నారు. 
 

55
ram charan

ఇటీవల లండన్‌లో తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్బంగా ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానులకు ఖుషి చేస్తున్నాయి.

సినిమాపై మరింత అంచనాలను పెంచుతున్నాయి. ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ఈ నెల (మే) మిడిల్‌లో స్టార్ట్ కాబోతుందట. ఈ ఏడాది ఎండింగ్‌లో సినిమాని విడుదల చేసే అవకాశం ఉంది. 
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!
Recommended Photos