మేడం టుస్సాడ్స్ లో నేడు స్టాచ్యూ లాంచ్ ఘనంగా జరగబోతోంది. దీనికోసమే మెగా ఫ్యామిలీ అక్కడికి వెళ్లారు. తాజాగా చరణ్, చిరంజీవి, సురేఖ, ఉపాసన అంతా మేడం టుస్సాడ్స్ కి చేరుకున్నారు. లండన్ లోని మెగా అభిమానులు రాంచరణ్ కి ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హంగామా చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.