పవన్ కళ్యాణ్ కి థ్యాంక్స్ చెప్పిన అత్తారింటికి దారేది హీరోయిన్.. లైవ్ లో రాంచరణ్ కి జానీ మాస్టర్ ఫోన్ 

First Published Mar 23, 2024, 10:17 AM IST

బుల్లితెరపై డ్యాన్స్ షోలు రసవత్తరంగా ఉంటాయి. కమెడియన్ గా బుల్లితెరపై సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హైపర్ ఆది ఢీ లాంటి డ్యాన్స్ షోలో సైతం సందడి చేయడం చూస్తూనే ఉన్నాం. 

బుల్లితెరపై డ్యాన్స్ షోలు రసవత్తరంగా ఉంటాయి. కమెడియన్ గా బుల్లితెరపై సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హైపర్ ఆది ఢీ లాంటి డ్యాన్స్ షోలో సైతం సందడి చేయడం చూస్తూనే ఉన్నాం.  ఢీ షోలో  యాంకర్ ప్రదీప్ చేసే హంగామా కూడా నవ్వించే విధంగా ఉంటుంది. ప్రస్తుతం యాంకర్ ప్రదీప్ స్థానంలోకి నటుడు నందు వచ్చారు. 

ఢీ సెలబ్రిటీ షో ప్రోమో తాజాగా విడుదలైంది. ఎప్పటిలాగే  హైపర్ ఆది రచ్చ రచ్చ చేశాడు. ప్రోమోలో ప్రతి ఒక్కరి డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఒకవైపు డ్యాన్స్ పెర్ఫామెన్స్ మరోవైపు హైపర్ ఆది కామెడీ రచ్చ అన్నట్లుగా సాగింది.

ఈ ఎపిసోడ్ లో గణేష్ మాస్టర్ కూడా పాల్గొన్నారు. మరోవైపు ప్రణీత సుభాష్ ఉంది. భీమ్లా నాయక్ సాంగ్ కి డ్యాన్స్ పెర్ఫామెన్స్ చేశారు. ఓ వ్యక్తి పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ గెటప్ లో అలరించారు. ప్రణీత వేదికపైకి వెళ్లి అత్తారింటికి దారేది చిత్రంలో బాపు బొమ్మ సాంగ్ కి డ్యాన్స్ చేసింది. 

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి పెద్ద థ్యాంక్స్ చెప్పాలి అని తెలిపింది. అత్తారింటికి దారేది చిత్రాన్ని గుర్తు చేసుకుంది. వేదికపై సరదాగా కాసేపు హైపర్ ఆది, జానీ మాస్టర్ క్రికెట్ ఆడారు. క్రికెట్ ఆడుతూ అమ్మాయిలపై హైపర్ ఆది తనదైన శైలిలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో రెచ్చిపోయాడు. 

ఇక చివర్లో ఢీ షో టీం మొత్తం రాంచరణ్ బర్త్ డేని అడ్వాన్స్ గా సెలెబ్రేట్ చేశారు. మార్చి 27న రాంచరణ్ తన జన్మదిన వేడుకలు జరుపుకోనున్నారు. ఢీ షో కూడా అదే రోజు ప్రసారం కానుంది. దీనితో జానీ మాస్టర్, హైపర్ ఆది, గణేష్ మాస్టర్ వీళ్లంతా రాంచరణ్ బర్త్ డే సెలెబ్రేట్ చేస్తూ కేక్ కట్ చేశారు. 

లైవ్ లో జాతిని మాస్టర్.. రాంచరణ్ కి ఫోన్ చేయడం విశేషం. రాంచరణ్ నమస్తే అండి అంటూ పలకరించారు.జానీ మాస్టర్ తన ఫోన్ లో మై హీరో రాంచరణ్ అన్న అని సేవ్ చేసుకుని ఉన్నాడు.  ఫోన్ లో రాంచరణ్ ఎలాంటి విషయాలు మాట్లాడారో తెలుసుకోవాలంటే ఈ షో పూర్తిగా చూడాల్సిందే. 

click me!