మోహన్‌బాబు అందరి ముందు నన్ను కింద పడేశాడు.. సెట్‌లో కలెక్షన్‌ కింగ్‌ చేసిన పని బయటపెట్టిన `వకీల్‌సాబ్‌` నటి

First Published Mar 23, 2024, 8:42 AM IST

మోహన్‌బాబు అంటే చిన్న ఆర్టిస్టు లు బయపడతారు. ఆయన కొడతారనే కామెంట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మోహన్‌బాబు సెట్‌లో చేసిన పని బయటపెట్టింది `వకీల్‌ సాబ్‌` నటి. 
 

కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు అంటే చాలా మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు భయపడతారు. సినిమాల షూటింగ్‌ టైమ్‌లో ఆయన రూల్స్ అంత స్టిక్ట్ గా ఉంటాయి కాబట్టి. టైమ్‌ సెన్స్ పాటించే విషయంలో, సిన్సియర్ గా వర్క్ చేసే విషయంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన ఉన్న సినిమా షూటింగ్ ల్లో అందరూ అదే పాటించాల్సి ఉంటుంది. లేదంటే ఆయనకు కోపం వస్తుంది. 

Survey:వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?
 

అయితే మోహన్‌బాబు ఆర్టిస్టులను కొడతారు అనే వాదన చాలా కాలంగా ఉంది. చెబితే వినకపోతే, టైమ్‌కి రాకపోతే, ఏదైనా ఓవర్‌ చేస్తే ఆయన కొడతారని అంటారు. అది చాలా కాలంగా నడుస్తూనే ఉంది. అయితే లేటెస్ట్ గా `వకీల్‌సాబ్‌` నటి ఈ విషయాన్ని బయటపెట్టింది. మోహన్‌బాబుతో వర్క్ ఎక్స్ పీరియెన్స్ ని పంచుకుంటూ తనకు జరిగిన సంఘటన గురించి వెల్లడించింది. 
 

`వకీల్‌ సాబ్`లో లేడీ ఎస్‌ఐ పాత్రలో నటించింది లిరిశా. ఆమె టీవీ సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చింది. చిన్నా, చితకా పాత్రలు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో మోహన్‌బాబు హీరోగా నటించిన `పొలిటికల్‌రౌడీ` మూవీలో హీరోయిన్‌ ఛార్మి ఫ్రెండ్‌ పాత్రలో నటించే ఆఫర్‌ వచ్చిందట. ఆ అవకాశం కమెడియన్‌ అలీ ద్వారా వచ్చిందట. 
 

సినిమా షూటింగ్‌కి వెళ్లినప్పుడు మొదట్లో మోహన్‌బాబుతో సీన్లు లేవట. ఆ తర్వాత ప్రకాష్‌ రాజ్‌, మోహన్‌బాబు సీన్లు పడ్డాయట. ఓ సీన్‌లో ప్రకాష్‌ రాజ్‌ తనని నెట్టేస్తే కింద పడాల్సి ఉంది. కానీ ఎంతకూ ఆ సీన్‌ చేయడం లేదట. తాను కింద పడలేకపోతుందట. చాలా టేక్స్ తీసుకుంటుందట. సెట్‌లో అందరు విసిగిపోయారు. దీంతో మోహన్‌బాబు రంగంలోకి దిగాడు. షాట్‌ పెట్టమని చెప్పి, సైలెంట్‌గా వచ్చి తనని ఓ తోపు తోసి కింత పడేశాడని తెలిపింది లిరిషా. 
 

మోహన్‌బాబు అలా గట్టిగా నెట్టడంతో తాను కిందపడిపోయానని, దీంతో చేతులు రాసుకుపోయినట్టు తెలిపింది. దానికి ఫస్ట్ ఎయిడ్‌ చేసిన తర్వాత మోహన్‌బాబు వచ్చి, ఇది యాక్టింగ్‌ అంటే అని చెప్పి వెళ్లిపోయారట. ఆ సమయంలో తన పరిస్థితి మరోలా మారిపోయిందని వెల్లడించింది లిరిషా. ఇందులో తనది విచిత్రమైన పాత్ర అని, రకరకాలుగా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత మోహన్‌బాబు తనని ఎంతో బాగా చూసుకున్నారని, బాగా చేసుకోవాలని చెప్పేవారని, యాక్టింగ్‌ సంబంధించిన సలహాలు కూడా ఇచ్చేవారని వెల్లడించింది `వకీల్‌సాబ్‌` నటి. 
 

లిరిషా.. `వకీల్‌ సాబ్‌`లో ఎస్‌ఐగా కనిపించారు. కోర్ట్ లో కేసు వాదనలు జరిగే సమయంలో పవన్‌ కళ్యాణ్‌ ఆమెని విచారించిన తీరు, ఆమెని సూపర్‌ ఉమెన్‌గా వర్ణించిన తీరు బాగా పేలింది. ఆ ఒక్క సీన్‌తో పాపులర్‌ అయిపోయింది లిరిషా. ఇరవై ఏళ్లుగా రాని గుర్తింపు ఆ ఒక్క సీన్‌తో వచ్చేసింది. ఆ తర్వాత బిజీ ఆర్టిస్ట్ అయిపోయింది. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంది. 
 

click me!