అయితే మోహన్బాబు ఆర్టిస్టులను కొడతారు అనే వాదన చాలా కాలంగా ఉంది. చెబితే వినకపోతే, టైమ్కి రాకపోతే, ఏదైనా ఓవర్ చేస్తే ఆయన కొడతారని అంటారు. అది చాలా కాలంగా నడుస్తూనే ఉంది. అయితే లేటెస్ట్ గా `వకీల్సాబ్` నటి ఈ విషయాన్ని బయటపెట్టింది. మోహన్బాబుతో వర్క్ ఎక్స్ పీరియెన్స్ ని పంచుకుంటూ తనకు జరిగిన సంఘటన గురించి వెల్లడించింది.
`వకీల్ సాబ్`లో లేడీ ఎస్ఐ పాత్రలో నటించింది లిరిశా. ఆమె టీవీ సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చింది. చిన్నా, చితకా పాత్రలు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో మోహన్బాబు హీరోగా నటించిన `పొలిటికల్రౌడీ` మూవీలో హీరోయిన్ ఛార్మి ఫ్రెండ్ పాత్రలో నటించే ఆఫర్ వచ్చిందట. ఆ అవకాశం కమెడియన్ అలీ ద్వారా వచ్చిందట.
సినిమా షూటింగ్కి వెళ్లినప్పుడు మొదట్లో మోహన్బాబుతో సీన్లు లేవట. ఆ తర్వాత ప్రకాష్ రాజ్, మోహన్బాబు సీన్లు పడ్డాయట. ఓ సీన్లో ప్రకాష్ రాజ్ తనని నెట్టేస్తే కింద పడాల్సి ఉంది. కానీ ఎంతకూ ఆ సీన్ చేయడం లేదట. తాను కింద పడలేకపోతుందట. చాలా టేక్స్ తీసుకుంటుందట. సెట్లో అందరు విసిగిపోయారు. దీంతో మోహన్బాబు రంగంలోకి దిగాడు. షాట్ పెట్టమని చెప్పి, సైలెంట్గా వచ్చి తనని ఓ తోపు తోసి కింత పడేశాడని తెలిపింది లిరిషా.
మోహన్బాబు అలా గట్టిగా నెట్టడంతో తాను కిందపడిపోయానని, దీంతో చేతులు రాసుకుపోయినట్టు తెలిపింది. దానికి ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత మోహన్బాబు వచ్చి, ఇది యాక్టింగ్ అంటే అని చెప్పి వెళ్లిపోయారట. ఆ సమయంలో తన పరిస్థితి మరోలా మారిపోయిందని వెల్లడించింది లిరిషా. ఇందులో తనది విచిత్రమైన పాత్ర అని, రకరకాలుగా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత మోహన్బాబు తనని ఎంతో బాగా చూసుకున్నారని, బాగా చేసుకోవాలని చెప్పేవారని, యాక్టింగ్ సంబంధించిన సలహాలు కూడా ఇచ్చేవారని వెల్లడించింది `వకీల్సాబ్` నటి.
లిరిషా.. `వకీల్ సాబ్`లో ఎస్ఐగా కనిపించారు. కోర్ట్ లో కేసు వాదనలు జరిగే సమయంలో పవన్ కళ్యాణ్ ఆమెని విచారించిన తీరు, ఆమెని సూపర్ ఉమెన్గా వర్ణించిన తీరు బాగా పేలింది. ఆ ఒక్క సీన్తో పాపులర్ అయిపోయింది లిరిషా. ఇరవై ఏళ్లుగా రాని గుర్తింపు ఆ ఒక్క సీన్తో వచ్చేసింది. ఆ తర్వాత బిజీ ఆర్టిస్ట్ అయిపోయింది. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంది.