ఫ్లాప్ డైరెక్టర్స్ తో సినిమాలపై రాంచరణ్ రియాక్షన్.. ఆరెంజ్ మూవీనే కారణం అంటూ షాకింగ్ కామెంట్స్

Published : Feb 20, 2026, 07:13 PM IST

Ram Charan: ఆరెంజ్ మూవీ తర్వాత తన ఆలోచనా విధానం ఎలా మారిందో రాంచరణ్ ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఫ్లాప్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి గల కారణాన్ని చెప్పారు. 

PREV
15
రాంచరణ్ సినిమాలు

గతంలో రాంచరణ్ తన దర్శకులని ఎంచుకునే విధానం వైవిధ్యంగా ఉండేది. ఒక దశలో ఫ్లాప్ డైరెక్టర్లు, అంతగా క్రేజ్ లేని దర్శకులతో కూడా రాంచరణ్ సినిమాలు చేశారు. దీనికి గల కారణాన్ని, తన ఆలోచనా విధానాన్ని రాంచరణ్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. ధ్రువ మూవీ రిలీజ్ అయిన సమయంలో ప్రమోషన్స్ కోసం డైరెక్టర్ హరీష్ శంకర్ తో ఇంటర్వ్యూలో రాంచరణ్ పాల్గొన్నారు.

25
ఆరెంజ్ తర్వాత మార్పు

ఈ ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ రాంచరణ్ కి ఒక ఆసక్తికర ప్రశ్న సంధించారు. ఆగడు ఫ్లాప్ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో నటించారు. కిక్ 2 ఫ్లాప్ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించారు. మొదటి సినిమా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో, రెండవ సినిమా రాజమౌళి దర్శకత్వంలో నటించినప్పటికీ ఆరెంజ్ తర్వాత మీలో మార్పు వచ్చింది.

35
సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ

సడెన్ గా ఎవ్వరికీ తెలియని సంపత్ నంది అనే దర్శకుడితో రచ్చ సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నారు. ఈ మార్పు ఎందుకు వచ్చింది అని హరీష్ శంకర్ ప్రశ్నించారు. రాంచరణ్ సమాధానం ఇస్తూ.. ఆరెంజ్ ఫ్లాప్ తర్వాత నాతో సినిమా చేయడానికి దర్శకులు నిర్మాతలు పలో మని వచ్చేయలేదు. నేను కూడా మంచి కథతో ఎవరు వచ్చినా చేయాలి అనే ఓపెన్ మైండ్ తో ఉన్నాను.

45
ఆయనంటే నాకు గౌరవం

ఆరెంజ్ ఫ్లాప్ తర్వాత నాతో సినిమా చేయాలి అని వచ్చిన మొట్ట మొదటి నిర్మాత ఆర్ బీ చౌదరి గారు. ఆయనంటే నాకు చాలా గౌరవం. అదే సమయంలో డైరెక్టర్ సంపత్ నంది ఓ కథతో వచ్చారు. కొత్త డైరెక్టర్.. ఒక్క సినిమా మాత్రమే చేశారు. బహుశా నేను అలాంటి కథలు చేయనేమో. కానీ ఆయన తెరకెక్కించిన తొలి సినిమా నాకు నచ్చింది. సినిమా మొత్తం ఎంటర్టైన్ అయ్యాను. అందుకే రచ్చ సినిమాకి ఓకే చెప్పినట్లు రాంచరణ్ తెలిపారు.

55
రాంచరణ్ పెద్ది మూవీ

ప్రస్తుతం రాంచరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ ఏప్రిల్ 30న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories