మణిరత్నం తదుపరి చిత్రం థగ్ లైఫ్
ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తున్న కొత్త చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. 'థగ్ లైఫ్' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 5న థియేటర్లలో విడుదల కానుంది. 38 ఏళ్ల తర్వాత కమల్ హాసన్, మణిరత్నం కలిసి పనిచేస్తున్న చిత్రమిది.
ఇంతకుముందు 'నాయకుడు' చిత్రంలో ఇద్దరూ కలిసి పనిచేశారు. కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్, మణిరత్నం మద్రాస్ టాకీస్, ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ ఈ మూడు సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
జయం రవి, త్రిష, దుల్కర్ సల్మాన్, అభిరామి, నాజర్ వంటి పెద్ద తారాగణం ఈ చిత్రంలో నటిస్తున్నట్లు మొదట ప్రకటించారు. అయితే డేట్స్ సమస్య కారణంగా దుల్కర్ సల్మాన్, జయం రవి చిత్రం నుండి తప్పుకున్నారు. దుల్కర్ సల్మాన్ స్థానంలో సింబు, జయం రవి స్థానంలో అశోక్ సెల్వన్ నటించారు. ఇటీవలే ఈ చిత్రంలోని మొదటి పాటని విడుదల చేశారు.
read more: బాలకృష్ణ హోస్ట్ గా మరో రియాలిటీ షో.. క్లారిటీ ఇచ్చిన టీమ్, ఏం చేయబోతున్నారంటే?
also read: విజయ్కి షాక్ ఇచ్చిన త్రిష.. పెళ్లిపై సంచలన స్టేట్మెంట్, సింగిల్గానే ఉండిపోతుందా?