రజనీకాంత్ భార్యకి విపరీతంగా నచ్చేసిన చిరంజీవి సినిమా..అంత గొప్ప చిత్రం ఏదో తెలుసా, స్వయంగా ఫోన్ చేసి

First Published Sep 20, 2024, 10:22 AM IST

చిరంజీవి తన కెరీర్ లో ఎక్కువగా అభిమానుల సంతోష పెట్టే మాస్ చిత్రాలు చేశారు. అప్పుడప్పుడూ స్వయం కృషి , ఆపద్భాందవుడు, రుద్రవీణ లాంటి కళాత్మక చిత్రాలు కూడా చేశారు. అయితే చిరంజీవి తన కెరీర్ లో తాను ఎంతో ఇష్టపడి.. తనకోసం తాను చేసిన చిత్రం ఒకటి ఉంది. 

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్  ఘనతలు చెప్పుకుంటూ పోతే పెద్ద చిట్టానే అవుతుంది. చిరంజీవికి మాస్ ఆడియన్స్ లో ఉన్న ఫ్యాన్ బేస్ ఇంకెవరికీ లేదు. ఒక దశలో రెమ్యునరేషన్ విషయంలో చిరంజీవి అమితాబ్ ని మించిపోయాడు అంటూ కూడా కథనాలు వచ్చాయి. 

చిరంజీవి తన కెరీర్ లో ఎక్కువగా అభిమానుల సంతోష పెట్టే మాస్ చిత్రాలు చేశారు. అప్పుడప్పుడూ స్వయం కృషి , ఆపద్భాందవుడు, రుద్రవీణ లాంటి కళాత్మక చిత్రాలు కూడా చేశారు. అయితే చిరంజీవి తన కెరీర్ లో తాను ఎంతో ఇష్టపడి.. తనకోసం తాను చేసిన చిత్రం ఒకటి ఉంది. ఆ మూవీ సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ కి విపరీతంగా నచ్చేసిందట. ఆ మూవీ మరేదో కాదు సైరా నరసింహా రెడ్డి. 

Latest Videos


స్వాతంత్ర పోరాట యోధుడు సైరా నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పరుచూరి బ్రదర్స్ కథ అందించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో దాదాపు 200 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కింది. భారీ బడ్జెట్ అంటే రిస్క్ ఎక్కువ. కానీ చిరంజీవికి ఇష్టమైన కథ అది. దీనితో తండ్రి కోసం రాంచరణ్ సొంత ప్రొడక్షన్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. 

సినిమా బావుందని ప్రశంసలు దక్కినప్పటికీ నష్టాలు తప్పలేదు. ఈ చిత్రంలో చిరంజీవి పెర్ఫామెన్స్ లో టాలీవుడ్ హీరోలంతా అభినందించారట. చిరంజీవి ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. నాగార్జున, వెంకటేష్ ఇద్దరూ మూవీ అద్భుతంగా ఉందని అభినందించినట్లు చిరు తెలిపారు. 

మూవీ రిలీజ్ అయ్యాక రజనీకాంత్, ఆయన సతీమణి లతా రజనీకాంత్ ఇద్దరూ కలసి సైరా చూశారట. మూవీ చూశాక రజనీకాంత్ నాకు ఫోన్ చేశారు. మూవీ బ్రహ్మాండంగా ఉంది అని అభినందించారు. వెంటనే ఆయన సతీమణి లతా గారు ఫోన్ తీసుకుని.. ఏం సినిమా అండీ, వండర్ ఫుల్ గా ఉంది. నిన్నంతా ఆ మూవీ ఫీలింగ్ లోనే ఉన్నాం అంటూ ఆమె సంతోషాన్ని తనతో పంచుకున్నట్లు చిరు తెలిపారు. 

తనకి మూవీ విపరీతంగా నచ్చేసింది అని చెప్పారట. కమర్షియల్ గా సైరా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ చిరంజీవి ఈ చిత్రంలో నటించి తన కోరిక నెరవేర్చుకున్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గ్గా నటించగా.. తమన్నా కీలక పాత్రలో నటించింది. 

click me!