1988లో వచ్చిన సినిమా 'గురు శిష్యన్'. ఇందులో రజనీకాంత్, ప్రభు, గౌతమి, సీత, చో రామస్వామి లాంటి వాళ్లు నటించారు. రజనీకి ఎన్నో హిట్లు ఇచ్చిన ఎస్.పి. ముత్తురామన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మీనా పంజు అరుణాచలం నిర్మించగా, ఇళయరాజా సంగీతం అందించారు. పాండియన్, రాధారవి, రవిచంద్రన్, సెందామరై, విను చక్రవర్తి, మనోరమ కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఈ సినిమా కోసం రజనీకాంత్ 25 రోజుల కాల్షీట్ ఇచ్చారు. సినిమాలోని పాటల చిత్రీకరణను మైసూరులోని బృందావన్ గార్డెన్స్లో తీస్తున్నారు. అక్కడ రజనీ, గౌతమిపై ఒక పాటను చిత్రీకరించిన తర్వాత, రెండో హీరో ప్రభు, సీతపై మరో పాటను షూట్ చేయడం మొదలుపెట్టారు.