యాంగ్రీ హీరో రాజశేఖర్ ఫ్యామిలీకి, మెగాస్టార్ చిరంజీవి కి మధ్య ఉన్న విభేదాలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో చాలా సందర్భాల్లో రాజశేఖర్ చిరంజీవిని విమర్శించారు. చిరంజీవి రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా రాజశేఖర్ విమర్శల తో విరుచుపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో జీవిత, రాజశేఖర్ ఇద్దరూ మాట్లాడుతూ చిరంజీవి ఫ్యామిలీ ప్రవర్తించే విధానం తమకు నచ్చదని ఆరోపణలు చేశారు.
అయితే మరో సందర్భంలో రాజశేఖర్ చిరంజీవి గురించి పాజిటివ్ గా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తమ కుమార్తె శివాని అపోలో మెడికల్ కాలేజీలో జాయిన్ అవుతున్న సందర్భంలో చిరంజీవి గారి సపోర్ట్ కోసం ఆయన ఇంటికి వెళ్లినట్లు రాజశేఖర్ తెలిపారు. ముందుగా చిరంజీవి గారి ఇంటికి జీవిత వెళ్ళింది. చిరంజీవి గారు చాలా బాగా రిసీవ్ చేసుకుని రాజశేఖర రాలేదా అని అడిగారట. దీంతో జీవితం వెంటనే నాకు ఫోన్ చేసి పిలిపించింది.
చిరంజీవి గారు నన్ను కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. గతంలో జరిగిన వివాదాల్లో ఇక మర్చిపోదాం, ఇక పైన హ్యాపీగా ఉందాం అని ఇద్దరం మాట్లాడుకున్నట్లు రాజశేఖర్ తెలిపారు. మా ఇద్దరి మధ్య అనేక విషయాలు చర్చకు వచ్చాయి. తాను చిరంజీవిని మీట్ కావడంతో మీడియాలో చాలా రూమర్స్ వచ్చాయి.
అదే సమయంలో రామ్ చరణ్ ధృవ చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఆ తమిళ మూవీ తని ఒరువన్ చిత్రంలో అరవింద్ స్వామి పాత్ర గురించి నాకు తెలుసు. ఈ విషయాన్ని చిరంజీవి గారికి చెప్పాను. అరవింద్ స్వామి పాత్ర నాకు చాలా ఇష్టం అని చిరంజీవితో అన్నాను. అంటే నువ్వు ఎందుకు చెప్తున్నావ్.. ధృవ చిత్రంలో నటిస్తావా అని అడిగారు.
నేను వెంటనే ధృవ చిత్రంలో నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పాను. దీంతో చిరంజీవి గారు ధృవ చిత్ర యూనిట్ కి నా గురించి చెప్పారు. రాజశేఖర్ ఈ మూవీలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పారట. అయితే చిత్ర యూనిట్ అప్పటికే అరవింద్ స్వామిని ఫిక్స్ అయి ఉన్నారు. ఒకరోజు ధృవ టీం నుంచి నాకు కాల్ వచ్చింది. ఈ మూవీలో అరవింద్ స్వామిని తీసుకుంటే పాత షాట్లు చాలా వాడుకునే అవకాశం ఉంటుంది. అందుకని ఏమీ అనుకోవద్దు అని నాతో చెప్పారు. నేను కూడా పర్వాలేదు అని అన్నట్లు రాజశేఖర్ తెలిపారు.