కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన రాజమౌళి.. `స్టూడెంట్ నెం 1` చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఎన్టీఆర్ హీరో. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. దీంతో రాజమౌళి అందరికి తెలిసిపోయారు. ఆ తర్వాత రెండో సినిమాగా `సింహాద్రి` చేశాడు టాలీవుడ్ రికార్డులు సృష్టించాడు. `సై`, `ఛత్రపతి`, `విక్రమార్కుడు`తో రికార్డులు తిరగరాశాడు. `మగధీర`తో నెక్ట్స్ లెవల్కి వెళ్లాడు. `ఈగ`, `మర్యాద రామన్న`, `బాహుబలి`, `ఆర్ఆర్ఆర్`తో ఇండియన్ బిగ్గెస్ట్ డైరెక్టర్గా ఎదిగాడు. ఇప్పుడు గ్లోబల్ మూవీపై కన్నేశాడు.