`మగధీర` కలెక్షన్ల విషయంలో మోసం.. అల్లు అరవింద్‌పై ఊగిపోయిన రాజమౌళి.. అసలేం జరిగింది?

First Published Jul 30, 2024, 9:38 PM IST

రాజమౌళి ఫస్ట్ హిస్టారికల్ మూవీ `మగధీర`. ఈ సినిమా కలెక్షన్ల విషయంలో నిర్మాత అల్లు అరవింద్‌ చేసిన మోసంపై రాజమౌళి సంచలన వ్యాఖ్యలు చేశారు.
 

దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల్లో `మగధీర` ఒకటి. 2009లో విడుదలైన ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన కాజల్‌ హీరోయిన్‌గా చేసింది. శ్రీహరి ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను బ్రేక్‌ చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. రాజమౌళి మైథలాజికల్‌ స్టయిల్‌లో చేసిన తొలి చిత్రమిది. నాలుగు వందల సంవత్సరాల తర్వాత మళ్లీ పుట్టడం అనే కాన్సెప్ట్ తో ప్రజెంట్‌ డేస్ ని, ఫాంటసీ మైథలాజికల్‌ అంశాలకు ముడిపెడుతూ తెరకెక్కించిన తీరు అదిరిపోయింది. విజువల్‌ వండర్ గా నిలిచింది. ఈ సినిమాతో రామ్‌ చరణ్‌ స్టార్‌ హీరో అయ్యాడు.  
 

అయితే ఈ సినిమా సమయంలో చోటు చేసుకున్న సంఘటనని పంచుకున్నారు రాజమౌళి. అల్లు అరవింద్‌ చేసిన పని తనకు ఎంత కోపం తెప్పించిందో తెలిపారు. ఆ సమయంలో కలెక్షన్ల కంటే ఎన్ని రోజులు ఆడిందనే లెక్కలు ఉండేవి. ఎంత ఎక్కువ రోజులు ఎక్కువ సెంటర్లలో అంత పెద్ద హిట్‌గా పరిగణించే రోజులు. ఇండస్ట్రీ వర్గాలు, నిర్మాతలు, అభిమానులు కూడా వాటినే ప్రతిష్టాత్మకంగా తీసుకునేవారు. హీరోల మధ్య అదే పోటీగా ఉండేవి. 

Latest Videos


 అయితే రాజమౌళికి అది నచ్చేది కాదు. ఒక స్థాయికి బాగానే ఆడుతుంది. కానీ ఆ తర్వాత మరీ బలవంతంగా ఆడిస్తుంటారనే ఫీలింగ్‌ తనని వెంటాడేదట. `సింహాద్రి`కి కూడా అలానే చేశారట.   అది ఆయనకు నచ్చలేదు. దీన్ని మార్చేయాలని భావించాడు. ఆ సమయంలోనే రామ్‌ చరణ్‌తో అల్లు అరవింద్‌ ప్రొడక్షన్‌లో `మగధీర` సినిమా చేశాడు రాజమౌళి. సినిమా షూటింగ్‌ టైమ్ లో నిర్మాత అల్లు అరవింద్‌తో ఈ చర్చ వచ్చింది. మనం మాత్రం ఇలాంటివి వేయోద్దు అన్నారట రాజమౌళి. దానికి అల్లు అరవింద్‌ కూడా ఓకే చెప్పారు. ఆయన కూడా ఇలాంటివి అవసరం లేదని ఇదొక బ్యాడ్‌ ట్రెండ్‌ ని ఫాలో అవుతున్నామని ఆయన కూడా అన్నారట. `మగధీర`కి అలా చేయోద్దనుకున్నారు.

ఆ ప్రకారంగానే `మగధీర` విడుదలై బ్లాక్‌ బస్టర్‌ అయ్యింది. అప్పటి వరకు హైయ్యెస్ట్ సినిమా రికార్డుని బ్రేక్‌ చేసి డబుల్, త్రిబుల్‌ చేసింది. దీంతో అంతా ఖుషీ అయ్యారు. నిర్మాతలు, రాజమౌళి, రామ్‌ చరణ్‌, చిరంజీవి ఇలా అంతా హ్యాపీగా ఉన్నారు. ఆ సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. అంత వరకు బాగానే ఉంది. ఇక నెమ్మదిగా సినిమా పోస్టర్లపై ఇన్ని రోజు, అన్ని రోజులు అని వేస్తున్నాడట నిర్మాత అల్లు అరవింద్‌. కలెక్షన్లు కాకుండా డేస్‌కి సంబంధించిన పోస్టర్లు వేశారట. అంతేకాదు వంద రోజులు సెంటర్లు పెంచి పోస్టర్లలో వేస్తున్నారట. 
 

ముందు అనుకున్నాం కదా మళ్లీ ఇలా డేస్‌ వేస్తున్నారేంటి?  అది నచ్చలేక అల్లు అరవింద్‌పై ఊగిపోయాడట రాజమౌళి. దీంతో నిర్మాత స్పందిస్తూ, నాక్కూడా నచ్చడం లేదు రాజమౌళి. కానీ ఫ్యాన్స్ నుంచి చాలా ప్రెజర్‌ ఉంది. తప్పడం లేదన్నాడట. అలా పోటీ పెరిగి రాంగ్‌ గా లెక్కలు చూపిస్తున్నారని వాపోయాడు రాజమౌళి. ఓపెన్‌ హార్ట్ విత్‌ ఆర్కే షోలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్‌ బాబుతో చేయబోతున్న సినిమాపై వర్క్ చేస్తున్నారు. ఇది త్వరలో ప్రారంభం కానుంది. 
 

click me!