RadheShyam Mind blowing OTT Offer : డైరెక్ట్ ఓటీటీలో ప్రభాస్‌ రాధేశ్యామ్ ? ఎన్ని వందల కోట్ల ఆఫరో తెలుసా..?

First Published Jan 4, 2022, 1:21 PM IST

కరోనా వల్ల భారీ బడ్టెట్ సినిమాలకు రిలీజ్ గండం పట్టుకుంది. ఆల్ రెడీ ట్రిపుల్ ఆర్ పోస్ట్ పోన్ కాగా.. సంక్రాంతి బరిలో ఉన్న రాధేశ్యామ్ కు ఓటీటీ డైరెక్ట్ రిలీజ్ కు.. భారీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.

Radhe Shyam

భారీ బడ్జెట్ సినిమాలను కరోనా గండం వెంటాడుతుంది. వందల కోట్ల బడ్జెట్ సినిమాలకే ప్రతీ సారి కోవిడ్ అడ్డుతగులుతుంది. అఖండ,పుష్పలాంటి భారీ హిట్స్ తో.. ఇండస్ట్రీ కోలుకుంటుంది అనుకున్న టైమ్ లో.. సంక్రాంతి రిలీజ్ కు రెడీగా ఉన్న ట్రిపుల్ ఆర్,(RRR) రాధేశ్యామ్(Radhe Shyam) లాంటి వందల కోట్ల బడ్ట్ సినిమాలకు థర్డ్ వేవ్ గండం గట్టిగా హెచ్చరిస్తుంది. ఇప్పటికే ప్రమాదం గుర్తించి ట్రిపుల్ ఆర్ రిలీజ్ బరి నుంచి పక్కకు తప్పుకోగా.. ప్రభాస్ రాధేశ్యామ్ మాత్రం ఇంకా సంక్రాంతి బరిలోనే ఉంది.

Radhe Shyam

సంక్రాంతి టైమ్ కి థియేటర్ల పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పటికే అన్ని స్టేట్స్ లో స్కూల్స్ కి హాలీడేస్ ఇచ్చేశారు. నెక్ట్స్ థియేటర్లవైపే చూస్తున్నారు. తమిళనాడులో ఇప్పటికే 50 పర్సంల్ ఆక్క్యూపెన్సీతో థియేటర్లు నడపాలని ప్రభుత్వం ఆదేశించింది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కు రెడీ అయిన రాధేశ్యామ్ కు ఇది పెద్ద దెబ్బ అని చెప్పాలి. కాని రిలీజ్ డేట్ మార్పు పై ఇప్పటి వరకూ మేకర్స్ ప్రకటించలేదు.

Radhe Shyam

ఈ నేపథ్యంలో రాధేశ్యామ్(Radhe Shyam) రిలీజ్ పై క్రేజీ రూమర్ ఒకటి గట్టిగా నడుస్తుంది.  రాధేశ్యామ్ కు ఓ పెద్ద ఓటీటీ సంస్థ నుంచి భారీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. దాదాపు 400 కోట్ల ఆఫర్ తో ఓటీటీ లో డైరెక్టర్ రిలీజ్ కు ఆఫర్ చేశారట. ఆల్ రెడీ రాధే శ్యామ్ ఆఫ్టర్ థియేటర్ రిలీజ్.. ఓటీటి  డీల్ జీ5తో ఉంది. కాని ఇప్పుడు థియేటర్ రిలీజ్ సాధ్యం అయ్యే పరిస్థితి లేదు. ఇప్పటికే  సినిమా స్టార్ట్ అయ్యి 3 ఏళ్లు అవుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ రాధేశ్యామ్ విషయంలో విసిగిపోయి ఉన్నారు.

ఎలాగైనా రాధేశ్యామ్ ను ఈ సంక్రాంతికి రిలీజ్ చేయాల్సిందే అనే పట్టుదలతో ఉన్నారు మేకర్స్. దాదాపు 300 కోట్ట బడ్జెట్ తో తెరకెకిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. కాని  400 కోట్ల ఆఫర్ వస్తే.. ఓటీటీ రిలీజ్ కు టీమ్ ఒప్పుకుంటారా..? గతంలో అక్షయ్ కుమార్ లక్ష్మీ మూవీ కూడా ఇలానే భారీ ఆఫర్ కు ఓటీటీ రిలీజ్ చేశారు. కాని వర్కట్ కాలేదు. మరి ఇంత భారీ సినిమా ఓటీటీ రిలీజ్ చేస్తే వర్క్ అవుట్ అవుతుందా..?  

కాని సినిమా రిలీజ్ ను ఇంకా ఎక్కువ కాలం ఆపలేరు మేకర్స్.. ఇప్పటికే బాగా లేట్ అయ్యింది. ఈ ఓటీటీ ఆఫర్ కూడా రూమర్ మాత్రమే అని తెలుస్తుంది. ఏది అయితే అది అయ్యింది. సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలని రాధేశ్యామ్ టీమ్ ఫిక్స్ అయ్యి ఉన్నారు. ఒక వేళ థార్డ్ వేవ్ గట్టిగా వచ్చి.. రిలీజ్ కు అడ్డు తగిలితే.. అప్పుడు చూసుకోవచ్చు.. కాని ఇప్పుడు రిలీజ్ డేట్ మార్పుపై ప్రకటన చేయకూడదు అనుకుంటున్నారు టీమ్.

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కింది రాధేశ్యామ్ మూవీ. టి సిరీస్ తో కలిసి యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈమూవీలో స్టార్ కాస్ట్ నటించారు. రోమన్ కాలం నాటి పాత ప్రేమ కథతో తెరకెక్కిన రాధేశ్యామ్ మూవీ నుంచి వచ్చిన అప్ డేట్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఏకంగా రోమన్ కాలం నాటి సెట్స్ ను వేశారు మేకర్స్. రాధేశ్యామ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళ,మలయాళ,కన్నడ, హిందీ భాషల్లో రలీజ్ కు రెడీ అయ్యింద రాధేశ్యామ్.

click me!