Devatha: నేను అమ్మని అవుతా.. చిన్మయి స్పీచ్ కు రాధ కన్నీళ్లు!

First Published Jun 30, 2022, 10:36 AM IST

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత (Devatha) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 30వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

 ఈరోజు ఎపిసోడ్ లో భాగ్యమ్మ స్కూల్ దగ్గర పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంతలో పిల్లలు రావడంతో సంతోష పడుతూ ఉంటుంది. ఇక పక్కనే ఉన్న మాధవ అది చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు భాగ్యమ్మ పిల్లలకు పండ్లు ఇవ్వగా సాయంత్రం తీసుకుంటాం అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతారు.
 

ఆ తరువాత భాగ్యమ్మ రాధ తో మాట్లాడాలి అని చెప్పి పక్కకు తీసుకొని వెళ్లి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు భాగ్యమా మాట్లాడుతూ ఒక రోజు స్కూల్ దగ్గర దేవికి,మాధవ నానా రకాల మాటలు అన్నీ చెప్పి దేవిని సొంతం చేసుకుంటున్నాడు అని ఆరోజు నేను కళ్ళు తాగి ఉంటే వాడి పని చెప్పేదాన్ని అంటూ కోపంతో రగిలిపోతుంది భాగ్యమ్మ.
 

ఆ తర్వాత దేవుడమ్మకు మనిద్దరి విషయం చెప్పాలనుకున్నాను అనడంతో రాధ షాక్ అవుతుంది. అంటే నన్ను ఇక్కడ కూడా ఉండనివ్వకుండా చేస్తావా అని భాగ్యం అని ప్రశ్నిస్తుంది రాద. నువ్వు నిజం చెబితే అత్తయ్య నన్ను ఒక్క క్షణం కూడా ఉంచదు వెంటనే తీసుకెళ్తుంది. సత్య కూడా ఇంట్లో ఎందుకు అని అక్కడి నుంచి వెళ్లి పోతుంది అనడంతో భాగ్యమ్మ షాక్ అవుతుంది.
 

అప్పుడు భాగ్యమ్మ తన ఇద్దరు కూతుర్ల పరిస్థితి తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు స్కూల్లో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు జరుగుతూ ఉండగా అక్కడికి ఆదిత్య రామ్మూర్తి తో పాటు మరొక మహిళా కలెక్టర్ వస్తారు. అప్పుడు దేవి మాట్లాడుతూ కలెక్టర్ అవ్వాలని ఉంది అని వేదికపై చెబుతూ ఆదిత్య గురించి గొప్పగా వివరిస్తుంది.
 

దాంతో ఆదిత్య,రాధ ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. కానీ మాధవ మాత్రం దేవి మాటలకు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆ తర్వాత చిన్న మాట్లాడుతూ తాను పెద్ది అయిన తర్వాత ఏమీ కానని ఒక మంచి తల్లిగా అవ్వాలనుకుంటున్నాను అనడంతో అందరూ ఆశ్చర్యపోతారు.
 

ఆ తర్వాత ఒక తల్లి పిల్లల కోసం ఆరాటపడే విషయాన్ని అద్భుతంగా చెబుతుంది. ఆ తర్వాత రాధ గురించి కూడా గొప్పగా చెబుతుంది. ఒక చిన్మయి మాటలకు రాధ బాగా ఎమోషనల్ అవుతుంది. ఇక ఆదిత్య కూడా రాధ గురించి చిన్మయి చెప్పిన మాటలు విని సంతోష పడుతూ ఉంటాడు.

click me!