ఢిల్లీకి చెందిన రాశీఖన్నా 2013లో `మద్రాస్ కేఫ్` అనే హిందీ మూవీతో నటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అది విమర్శకుల ప్రశంసలందుకుంది. ఆ తర్వాత తెలుగులో ఆఫర్లు క్యూ కట్టాయి. `మనం`లో గెస్ట్ గా మెరిసింది.
`ఊహలు గుసగుసలాడే` చిత్రంతో హీరోయిన్ అయిపోయింది. తొలి చిత్రం హిట్ కావడంతో, అందరిని ఆకట్టుకునేలా ఆమె ఉండటంతో మేకర్స్ ఆఫర్లతో క్యూ కట్టారు. `జోరు`, `జిల్`, `శివం`, `బెంగాల్ టైగర్`, `సుప్రీమ్`, `హైపర్`, `జైలవకుశ`, `ఆక్సిజన్`, `టచ్ చేసి చూడు`, `తొలిప్రేమ`,
`శ్రీనివాస కళ్యాణం`, `వెంకీ మామ`, `ప్రతి రోజు పండగే`, `వరల్డ్ ఫేమస్ లవర్`, `పక్కా కమర్షియల్`, `థ్యాంక్యూ` వంటి చిత్రాలు చేసింది. మంచి విజయాలే అందుకుంది. స్టార్ హీరోయిన్గా ఎదిగింది.