`గేమ్‌ ఛేంజర్‌`కి లైన్‌ క్లీయర్‌.. `పుష్ప 2` టీమ్‌ వెనక్కి తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న దిల్‌ రాజు

Published : Jan 08, 2025, 08:10 PM IST

రామ్‌ చరణ్‌ `గేమ్‌ ఛేంజర్‌`కి లైన్‌ క్లీయర్‌ అయ్యింది. దిల్‌ రాజు ఊపిరి పీల్చుకున్నారు. కారణం `పుష్ప 2` టీమ్‌ వెనక్కి తగ్గడమే. మరి ఇంతకి ఏం జరిగింది? ఆ కథేంటి?  

PREV
16
`గేమ్‌ ఛేంజర్‌`కి లైన్‌ క్లీయర్‌.. `పుష్ప 2` టీమ్‌ వెనక్కి తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న దిల్‌ రాజు

రామ్‌ చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందిన `గేమ్‌ ఛేంజర్‌` మూవీ మరో రెండు రోజుల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. దిల్‌ రాజు నిర్మించిన ఈ మూవీ సుమారు రూ. 450కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. ఇందులో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించారు. ఎస్‌ జే సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌ ముఖ్యపాత్రలు పోషించారు. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. 

26

`గేమ్‌ ఛేంజర్‌` విడుదల వేళ `పుష్ప 2` రూపంలో పెద్ద అడ్డంకి వచ్చింది. `గేమ్‌ ఛేంజర్‌`కి మాత్రమే కాదు, సంక్రాంతి సినిమాలన్నీంటికి షాకిచ్చేలా `పుష్ప 2` టీమ్‌ నిర్ణయం తీసుకుంది. ఈ మూవీ ఇప్పటికే భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. నార్త్ లో దుమ్మురేపుతుంది. ప్రపంచ వ్యాప్తంగా `బాహుబలి 2` రికార్డులను కూడా బ్రేక్‌ చేసింది. ఇంకా థియేటర్లో రన్‌ అవుతుంది. ఈ క్రమంలో దీనికి మరికొంత కంటెంట్‌ని యాడ్‌ చేస్తున్నారు. 

read more: 'గేమ్ ఛేంజర్' కాపీనా? స్టార్ హీరో సినిమా కథే, రిలీజ్ కి ముందు మరో వివాదం
 

36

లెంన్త్ ఎక్కువ కావడం వల్ల కొంత కంటెంట్‌ని పక్కన పెట్టింది టీమ్‌. అయినా `పుష్ప 2` మూడు గంటల ఇరవై నిమిషాలతో విడుదల చేశారు. నిడివిని లెక్క చేయకుండా ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు మరో ఇరవై నిమిషాలు యాడ్‌ చేయాలని ప్లాన్‌ చేశారు. `పుష్ప 2 రీలోడెడ్‌` పేరుతో జనవరి 11 నుంచి మరో ఇరవై నిమిషాలు యాడ్‌ చేస్తామని టీమ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇది `గేమ్‌ ఛేంజర్‌`,`డాకు మహారాజ్‌`, `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాలకు పెద్ద ఎఫెక్ట్ కాబోతుందని భావించి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు వణికిపోయారు. అయితే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది `పుష్ప 2` టీమ్‌. కొంత ఆలస్యంగా జనవరి 17 నుంచి యాడ్‌ చేయబోతున్నట్టు తెలిపింది. 
 

46

కొన్ని టెక్నీకల్‌ కారణాలతో కొత్త కంటెంట్‌ని యాడ్‌ చేయలేకపోతున్నామని, జనవరి 11 నుంచి `పుష్ప 2` లో కొత్త కంటెంట్‌ యాడ్‌ కావడం లేదని, జనవరి 17 నుంచి కలుపబోతున్నట్టు తెలిపింది. దీంతో అటు నిర్మాత దిల్‌ రాజు, `గేమ్‌ ఛేంజర్‌` టీమ్‌, అలాగే `డాకు మహారాజ్‌` టీమ్‌, `సంక్రాంతికి వస్తున్నాం` టీమ్ ఊపిరి పీల్చుకుంది.  

also read: నాగార్జున పాటకి బాలకృష్ణ ఊరమాస్‌ డాన్స్ చూశారా? ఈ అరుదైన సందర్భానికి కారణం ఏంటంటే?

56

అయితే `పుష్ప 2`లో మరో ఇరవై నిమిషాలు యాడ్‌ చేస్తున్నారని తెలిసి భయపడ్డ దిల్‌ రాజు `పుష్ప 2` టీమ్‌తో మాట్లాడి దాన్ని పోస్ట్ పోన్‌ చేయించాడట. సంక్రాంతి సినిమాలకు ఎఫెక్ట్ అవుతుందని చెప్పి రిక్వెస్ట్ చేయడంతో వాళ్లు వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది.

లేదంటే ఆ మూవీకే ఆడియెన్స్ మళ్లీ క్యూ కడితే సంక్రాంతి సినిమాలకు కలెక్షన్ల పరంగా పెద్ద దెబ్బ అవుతుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. మొత్తంగా దిల్‌ రాజు ఇప్పుడు కాస్త రిలాక్స్ అయ్యారని చెప్పొచ్చు. 

66

అల్లు అర్జున్‌ హీరోగా రూపొందిన `పుష్ప 2` సినిమాకి సుకుమార్‌ దర్శకుడు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా, ఫహద్‌ ఫాజిల్‌ నెగటివ్‌ రోల్‌ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. డిసెంబర్‌ 5న విడుదలైన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 1800కోట్లు దాటింది. `బాహుబలి 2` కలెక్షన్లని దాటేసినట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఒరిజినల్‌ కలెక్షన్లు 1600 కోట్లలోనే ఉంటాయని టాక్‌. నిజం ఎంతా అనేది తెలియాల్సి ఉంది. 

read more: సంక్రాంతికి ప్రభాస్‌ కొత్త సినిమా ప్రకటన?, దర్శకుడు ఎవరో తెలిస్తే పూనకాలే!

also read: పుష్ప 2లో వాడు దొంగ కాకపోతే మహానుభావుడా ? రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ పై అల్లు అర్జున్ షాకింగ్ రియాక్షన్
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories