లేటెస్ట్.. ‘పుష్ప 2’ షూటింగ్ అప్డేట్.. రెగ్యూలర్ షూట్ కు సర్వం సిద్ధమైన యూనిట్.!

Published : Jun 11, 2022, 05:05 PM ISTUpdated : Jun 11, 2022, 05:08 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘పుష్ఫ : ది రైజ్’. ఈ బ్లాక్ బాస్టర్ మూవీ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ప్రస్తుతం పార్ట్ 2కు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. తాజాగా రెగ్యూలర్ షూట్ పై అప్టేట్ అందింది.  

PREV
16
లేటెస్ట్.. ‘పుష్ప 2’ షూటింగ్ అప్డేట్.. రెగ్యూలర్ షూట్ కు సర్వం సిద్ధమైన యూనిట్.!

పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన పుష్ప (Pushpa : The Rise) మూవీ సంచలన విజయాన్ని సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, బాలీవుడ్ లోనూ రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. బాక్సాఫీసు వద్ద వరల్డ్ వైడ్ రూ.365 కోట్లకు పైగా వసూళ్లు సాధించి.. హ్యయేస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్ గా చోటు దక్కించుకుంది.
 

26

అటు తమిళ, మలయాళ , కన్నడ భాషల్లో కూడా అద్భుతమైన విజయాన్ని సాధించింది పుష్ఫ పార్ట్ 1. ఈ చిత్రంలో ఇప్పటికీ  క్రేజ్ తగ్గలేదు. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ఫ రాజ్’ మ్యానరిజం ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది. గతంలోనే దర్శకుడు సీక్వెల్ ను కూడా ప్రకటించడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. 

36

పుష్ప పార్ట్ 1 గతేడాది డిసెంబర్ 14న రిలీజ్ అయ్యింది. ఆ వెంటనే పార్ట్ కూడా షూటింగ్ ప్రారంభం అవుతుందని చాలానే ఊహాగానాలు వినిపించాయి. మరోవైపు అల్లు  అర్జున్ కూడా మార్చి, ఏప్రిల్ లోనే  షూటింగ్ ను స్టార్ చేసిన ఆరు లేదా ఏడు నెలల్లో చిత్రాన్ని పూర్తి చేయాలని సీరియస్ గా చెప్పటినట్టు టాక్. 

46

దీంతో సినిమా షూటింగ్  త్వరలో ప్రారంభమై ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుందని ‘పుష్ఫ’ అభిమానులు ఎంతగానో ఆశించారు. కానీ దాదాపు ఆరు నెలలు పూర్తవుతున్నా ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు. ఇంకెప్పుడు మొదలవుతుందోనని అందరూ ఆత్రుతగా ఎదురుచూశారు. తాజాగా షూటింగ్ పై అప్డేట్ అందింది.

56

ఇన్నాళ్లు స్క్రిప్ట్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది.  ప్రస్తుతం షూటింగ్ కు రెడీ అయినట్టు సినీ వర్గాల నుంచి సమాచారం. ఇప్పటికే షూటింగ్ మొదలవ్వాల్సిన ‘ఫుష్ఫ : ది రైజ్’ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. జూలై చివరి వారంలో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమైన తర్వాత అతి తక్కువ సమయంలోనే సినిమాను పూర్తి చేయాలనే ప్లాన్ ఉందట టీమ్.  
 

66

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై  బ్యానర్ పై నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు. హీరోయిన్ గా రష్మిక మందన్ననే నటించనుంది. ఫాహద్ ఫాసిల్, సునిల్, అనసూయ, జగదీష్ ప్రతాప్ బండారి, రావు రమేశ్, ధనంజయ్, అజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించనున్నారు. అయితే ఈ చిత్రాన్ని పార్ట్ వన్ కంటే.. భారీ  బడ్జెట్  రూ.400 కోట్లతో నిర్మించనున్నారు.  
 

Read more Photos on
click me!

Recommended Stories