బిగ్ బాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన పునర్నవి భూపాళం..!

First Published Aug 17, 2020, 4:02 PM IST

బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న తెలుగు అమ్మాయి పునర్నవి భూపాళం బాగానే పేరుతెచ్చుకుంది. ఆ సీజన్ విన్నర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో హౌస్ లో ఆమె చేసిన రొమాన్స్ షోకి హైలెట్ గా  నిలిచింది. మరో కొద్దిరోజులలో సీజన్ 4 గ్రాండ్ గా మొదలుకానుండగా బిగ్ బాస్ పై పునర్నవి కామెంట్స్ సంచలనంగా మారాయి.  
 

విదేశాల నుండి దిగుమతి చేసుకున్న రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. ఎప్పుడో హిందీలో మొదలైన బిగ్ బాస్ మెల్లగా అన్ని ప్రాంతీయ భాషలకు వ్యాపించింది. తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్ గా 2017లో మొదలై, సక్సెస్ ఫుల్ గా మూడు సీజన్స్ కంప్లీట్ చేస్తుకుంది. కాగా గత సీజన్లో బిగ్ బాస్ షోలో పాల్గొన్న పునర్నవి భూపాళం బిగ్ షో పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
undefined
బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న యంగ్ హీరోయిన్ పునర్నవి భూపాళం బాగానే పాపులర్ అయ్యింది. ప్రేక్షకుల ఫేవరేట్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉన్న ఆమె షోలో చివరి ఎపిసోడ్స్ వరకు రాణించింది.
undefined
ముఖ్యంగా బిగ్ బాస్ 3 విన్నర్ అయిన రాహుల్ సిప్లిగంజ్ తో ఈమె కెమిస్ట్రీ బుల్లితెరపై బాగా పండింది. ఈమె షోలో ఎక్కువ రోజులు కొనసాగడానికి కూడా వీరిద్దరి రొమాంటిక్ ఎపిసోడ్స్ కారణం అని చెప్పాలి. ఇక షో నుండి బయటికి వచ్చాక వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని ప్రచారం కూడా జరిగింది.
undefined
కాగా బిగ్ బాస్ షో వలన తనకు ఒరిగింది ఏమి లేదని పునర్నవి సంచలన వ్యాఖ్యలు చేశారు. పైగా ఈ షోలో పాల్గొనడం వలన తన కెరీర్డ్యామేజ్ అయ్యిందని చెప్పింది. అలాగే చాలా అవకాశాలు కోల్పోయాను అని చెప్పింది.ఈ షోలో పాల్గొనితప్పు చేశానన్న ఆమె బిగ్ బాస్ కి వెళ్లకపోతే బెటరని సమాధానం చెప్పింది.
undefined
ఏరికోరి పోటీపడి షోకి వెళ్లిన పునర్నవి మాటలు అందరినీ షాక్ కి గురిచేస్తున్నాయి. ఇక ఈ మధ్య సైకిల్ అనే ఓ మూవీలో నటించిన ఈమె, హిందీలో బాగా పాప్యులర్ అయిన పర్మినెంట్ రూమ్మేట్స్ సిరీస్ లో లీడ్ రోల్ చేయనుంది. పవన్ సాధినేని తెరకెక్కిస్తున్న ఈ సిరీస్ లో హీరోగా రాజ్ సంపర నటిస్తున్నారు. మరి ఈ సిరీస్ అయినా ఆమెకు బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.
undefined
click me!