తమిళఫిల్మ్ ఇండస్ట్రీలో పలువురు స్టార్ హీరోలకు బిగ్ షాక్ ఇచ్చింది నిర్మాతల మండలి. నలుగురు హీరోలకు రెడ్ కార్డు జారీకి రెడీ అయ్యింది. అది కూడాచిన్న చితకా హీరోలు కాదు.. స్టార్ హీరోలు అయిన ధనుష్, విశాల్, శింబు, అథర్వ మురళీకు.. రెడ్కార్డు జారీ చేయాలని నిన్న జరిగిన సర్వసభ్య సమావేశంలో నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కోలీవుడ్ లో ఈ విషయం సంచలనంగా మారింది.