సౌందర్య పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెని ఒకసారి కలిశా. అమ్మా మీ నాన్న చెప్పినవన్నీ నీ జీవితంలో జరుగుతున్నాయి. జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది అని చెప్పారు. అమితాబ్ బచ్చన్, చిరంజీవి, రజనీకాంత్, మోహన్ లాల్ ఇలా అన్ని భాషల్లో స్టార్ హీరోలందరితో నటించావు. ఇక మిగిలింది ఒక్కటే.. ఇండస్ట్రీ దూరంగా ఉంటూ నీ ఫ్యామిలీతో గడుపుతావు అని చెప్పారట. దీనికి సౌందర్య రియాక్ట్ అవుతూ అంత మాట మాట అన్నారేంటి సార్.. మా నాన్న చెప్పినవన్నీ జరిగాయి. ఇదొక్కటే తప్పు అని నిరూపిస్తా. మరణించే వరకు సినిమా రంగంలోనే కొనసాగుతా అని చెప్పింది.