సినిమా ఇండస్ట్రీలో తనపై కొందరు కావాలనే ద్వేషపూరిత ప్రచారం చేశారని నటి ప్రియాంక మోహన్ ఓపెన్ కామెంట్స్ చేసింది. ఆమె చేసిన ఈ ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
ఓజి, గ్యాంగ్ లీడర్, సరిపోతా శనివారం సినిమాలతో టాలీవుడ్ లో, 'డాన్', 'కెప్టెన్ మిల్లర్' లాంటి సినిమాలతో తమిళంలో ఫేమస్ అయింది నటి ప్రియాంక మోహన్. తన కెరీర్లో ఒకానొక దశలో తనపై ద్వేషపూరిత ప్రచారం జరిగిందని ఆమె ఓపెన్ కామెంట్స్ చేసి షాక్ ఇచ్చింది. అయితే ఆ గతాన్ని మళ్లీ గుర్తుచేసుకోవడం ఇష్టం లేదని, ఆ అనుభవమే తనను మంచి మనిషిగా మార్చిందని ప్రియాంక తెలిపింది.
24
గతాన్ని మళ్లీ తలుచుకోవాలనుకోవట్లేదు..
ఈ విషయంపై ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక మోహన్ మాట్లాడింది. 'నాపై ద్వేష ప్రచారం జరిగింది. ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరూ అందరినీ ట్రోల్ చేస్తున్నారు. లెజెండరీ యాక్టర్లు, డైరెక్టర్లను కూడా వదలట్లేదు. నా విషయంలోనూ ఇలాంటివి చాలా జరిగాయి. కానీ నేను ఆ గతాన్ని మళ్లీ తలుచుకోవాలనుకోవట్లేదు' అని ప్రియాంక చెప్పింది.
34
நல்ல மனிதராக மாற்ற உதவியது
ప్రియాంక మాట్లాడుతూ.. ' ఆ అనుభవం నన్ను ఒక మంచి మనిషిగా మార్చింది. దాని నుంచి నేను చాలా నేర్చుకున్నాను. సినిమా ఇండస్ట్రీలో ఏదీ శాశ్వతం కాదు. ఇక్కడ ఎవరికైనా, ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. కానీ కష్టకాలం వచ్చినప్పుడే మనం మరింత ఎత్తుకు ఎదగగలం' అని ప్రియాంక మోహన్ చెప్పింది. సుధీర్ శ్రీనివాసన్తో జరిగిన ఇంటర్వ్యూలో ప్రియాంక ఈ విధంగా స్పందించింది.
నటి ప్రియాంక మోహన్ ప్రస్తుతం తెలుగులో బిజీగా ఉంది. చివరగా పవన్ కళ్యాణ్ సరసన 'ఓజీ' (OG) సినిమాలో నటించింది. తమిళంలో ఆమె నటించిన చివరి సినిమా 'బ్రదర్' పెద్ద ఫ్లాప్ అయింది. ప్రస్తుతం అక్కడ కవిన్కు జోడీగా ఒక సినిమా చేస్తోంది. ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇది కాకుండా, రజినీకాంత్ 'తలైవర్ 173' సినిమాలో కూడా ప్రియాంకకు అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమాకు 'డాన్' డైరెక్టర్ సిబి చక్రవర్తి దర్శకత్వం వహించనుండటం విశేషం.