ప్రియమణి ఇప్పుడు సినిమాల్లో కీలక పాత్రల్లో మెరుస్తూ ఆకట్టుకుంటుంది. 2003 లో `ఎవరే అతగాడు` చిత్రంతో టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ప్రియమణి `పెళ్లైన కొత్తలో` చిత్రంతో పాపులర్ అయ్యింది ప్రియమణి. ఆ తర్వాత `గోలీమార్`, `యమదొంగ`, `నవవసంతం`, `హరే రామ్`, `కింగ్`, `ద్రోణ`, `మిత్రుడు`, `ప్రవరాఖ్యుడు`, `శంభో శివ శంభో`, `సాధ్యం`, `రక్త చరిత్ర`, `రగడ`, `రాజ్`, `చండీ` వంటి చిత్రాల్లో హీరోయిన్గా మెప్పించింది. స్టార్ హీరోయిన్గా రాణించింది.