రెమ్యునరేషన్ పెంచేసిన 'ప్రేమలు' హీరోయిన్.. ఇప్పుడు ఒక్కో సినిమాకి ఎంత తీసుకుంటుందంటే?

First Published Mar 22, 2024, 4:15 PM IST

'ప్రేమలు' హీరోయిన్ మమిత బైజు (Mamitha)తన రెమ్యూనరేషన్ ను రెట్టింపు చేసింది. ఒక్క సినిమాతోనే దక్షిణాది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పైనే దర్శక నిర్మాతలు చూపు ఉంది.

మలయాళం హీరోయిన్ మమితా బైజు రీసెంట్ గా 'ప్రేమలు' Premalu సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మలయాళం లో రూపుదిద్దుకున్న ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తెలుగు వెర్షన్ లోనూ విడుదలై మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. 

తొలి సినిమాతోనే దక్షిణాదిలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. 2017 లోనే ఈ ముద్దుగుమ్మ నటిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. పలు మలయాళ చిత్రాలతో హీరోయిన్ గా అలరించింది. చివరిగా ప్రేమలు సినిమాతో గుర్తింపు దక్కించుకుంది. 

ప్రేమలు సినిమా తర్వాత ముఖ్యంగా మమిత బైజుకు మంచి క్రేజ్ దక్కింది. ఆమె నటనకు ప్రశంసలు అందాయి. అంతేకాదు ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ నుంచి కూడా ఈమెకు ఆఫర్లు అందుతుండడం విశేషం.

జీవీ ప్రకాష్, విష్ణు విశాల్ వంటి యంగ్ హీరోలకు జోడిగా నటించేందుకు ఈ ముద్దుగుమ్మ రెడీ అయినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. ఏదేమైనా సౌత్ లో Mamitha సెన్సేషన్ గా మారింది. దీంతో దర్శక, నిర్మాతల చూపు ఈ బ్యూటీ పై పడింది.

ఇలా సెన్సేషన్ గా మారిన మమిత బైజు తన రెమ్యూనరేషన్ విషయంలో స్పీడ్ పెంచింది. ఒక హిట్టు పడగానే పారితోషకాన్ని రెట్టింపు చేసిందని తెలుస్తోంది. ఇకపై ఆచార్జీలతోనే సినిమాలను ఓకే చేయనుంది అని ప్రచారం జరుగుతుంది.

గతంలో ఈ యంగ్ బ్యూటీ ఒక్కొక్క సినిమాకు రూ. 30 లక్షలు తీసుకుందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం చేయబోయే సినిమాలకు రూ. 50 లక్షల నుంచి 60 లక్షల వరకు చార్జ్ చేస్తుందంట. ఇక మున్ముందు వచ్చే సక్సెస్ ను బట్టి మరింతగా చార్జ్ చేయనుందని తెలుస్తోంది. 

click me!