Samantha: సమంత ఎంకరేజ్ చేసినా ప్రీతమ్ పడిపోయాడుగా.. వైరల్ అవుతున్న సామ్ కామెంట్స్

First Published Jan 12, 2022, 11:02 AM IST

టాలీవుడ్ లో క్రేజీ కపుల్స్ గా ఉన్న నాగ చైతన్య, సమంత విడిపోతారని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. గత ఏడాది వీరిద్దరి బ్రేకప్ టాలీవుడ్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్ గా మిగిలిపోయింది. వీరిద్దరూ విడిపోయి నెలలు గడచిపోతున్నాయి. ఎవరి సినిమాలతో వారు బిజీ అయిపోయారు.

టాలీవుడ్ లో క్రేజీ కపుల్స్ గా ఉన్న నాగ చైతన్య, సమంత విడిపోతారని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. గత ఏడాది వీరిద్దరి బ్రేకప్ టాలీవుడ్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్ గా మిగిలిపోయింది. వీరిద్దరూ విడిపోయి నెలలు గడచిపోతున్నాయి. ఎవరి సినిమాలతో వారు బిజీ అయిపోయారు. సమంత పాన్ ఇండియా చిత్రాలతో రెడీ అవుతోంది. ఇక నాగ చైతన్య ఈ సంక్రాంతికి బంగార్రాజు చిత్రంతో చిన బంగార్రాజుగా వచ్చేస్తున్నాడు. 

కానీ వీరిద్దరి మధ్య బ్రేకప్ ఎందుకు జరిగిందనే అంశంపై తరచుగా అక్కినేని ఫ్యాన్స్ లో చర్చ జరుగుతూనే ఉంది. ఇదిలా ఉండగా సమంత ప్రస్తుతం తన తదుపరి చిత్రాలకు రెడీ అయ్యేందుకు జిమ్ లో కసరత్తులు మొదలు పెట్టింది. సమంత జిమ్ వర్కౌట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన జిమ్ వర్కౌట్స్ తో సమంత నెటిజన్లకు 'లెవల్ అప్ ఛాలెంజ్' అనే కొత్త ఛాలెంజ్ విసిరింది. 

ఈ ఛాలెంజ్ ని సమంతకు ఆమె ఫిట్ నెస్ ట్రైనర్ జునైద్ షేక్ ఇచ్చాడు. జిమ్ లో చెమటలు చిందిస్తూ సమంత ఈ ఛాలెంజ్ ని సక్సెస్ ఫుల్ గా ఫినిష్ చేసింది. మోకాళ్లపై కూర్చుని ముందుకు కష్టతరమైన జంప్ చేయాలి. అది అంత సులువు కాదు. కానీ సమంత ఫిట్ నెస్ గురించి చెప్పనవసరం లేదు. సునాయాసంగా ఈ ఛాలెంజ్ ని పూర్తి చేసింది. ఈ వీడియో షేర్ చేస్తూ సమంత నెటిజన్లకు ఈ ఛాలెంజ్ ఇచ్చింది. 

నెటిజన్లతో పాటు సమంత లెవల్ అప్ ఛాలెంజ్ ని సెలెబ్రిటీలు కూడా స్వీకరిస్తున్నారు. కియారా అద్వానీ సమంత వీడియోకు ఫైర్ ఎమోజితో రియాక్షన్ తెలిపింది. సమంత ఛాలెంజ్ ని ఆమె స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్,  రోహిత్ భట్కర్, మేకప్ ఆర్టిస్ట్ రంభియా ట్రై చేశారు. సమంత ఛాలెంజ్ ని రోహిత్ విజయవంతంగా ఫినిష్ చేశాడు. 

కానీ  రంభియా, ప్రీతమ్ జుకల్కర్ ల ప్రయత్నాలు బెడిసికొట్టాయి. రంభియా వెల్లకిలా పడిపోయింది. ప్రీతమ్ మాత్రం ముందుకు పడిపోయాడు. దీనితో సమంత కు నవ్వు ఆగలేదు. నేను ఎంకరేజ్ చేద్దామనుకున్నా ప్రీతమ్ వల్ల కావడం లేదు, ఛాలెంజ్ లో ఓడిపోయాడు అంటూ సమంత కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. 

సమంత, చైతు బ్రేకప్ తర్వాత ఎక్కువగా వార్తల్లో నిలిచిన వ్యక్తి ప్రీతమ్. సమంత, ప్రీతమ్ లపై అనేక ఆరోపణలు వినిపించాయి. ఆ టైం లో సమంత మానసికంగా కుంగిపోయిన సంగతి తెలిసిందే. సమంత తన సోదరితో సమానం అంటూ ప్రీతమ్ పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. కానీ ప్రీతమ్ వల్లే సమంత, చైతు మధ్య విభేదాలు తలెత్తాయని అతడిని ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఇక సమంత ఆ చేదు జ్ఞాపకాల నుంచి దూరం అవుతూ యశోద అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో పౌరాణిక చిత్రం 'శాకుంతలం'లో టైటిల్ రోల్ ప్లే చేస్తోంది. 

click me!