ముంబై మహాలక్ష్మిలోని లోఖండ్వాలా మినర్వా టవర్లోని తన రెండు అపార్ట్మెంట్లను ప్రభుదేవా రూ.14.8 కోట్లకు అమ్మేశారు. 14 ఏళ్ల క్రితం పెట్టిన పెట్టుబడిపై ఆయనకు కేవలం రూ.35 లక్షల లాభం మాత్రమే వచ్చిందట.
స్థలం కొంటే నష్టం రాదనేది చాలామంది నమ్మకం. అందుకే చాలామంది ఇళ్లు, ఫ్లాట్లపై పెట్టుబడి పెడతారు. కానీ ఇల్లు కొంటే దాని విలువ దానంతట అదే పెరుగుతుందనే ఆలోచన అన్నిసార్లూ నిజం కాకపోవచ్చు.
24
ముంబయ్ ఇళ్లు అమ్మేసిన ప్రభుదేవ..
ప్రభుదేవా 2012 డిసెంబర్లో ముంబైలో ఈ ఫ్లాట్లు కొన్నారు. 32, 33వ అంతస్తుల్లో ఉన్న ఈ రెండు అపార్ట్మెంట్లు ఒక్కొక్కటి 1,295 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. వీటి కోసం ఆయన అప్పట్లో రూ.14.45 కోట్లు చెల్లించారు. ఇప్పుడు వాటిని అమ్మేశారు.
34
14 ఏళ్లలో 35 లక్షల లాభం
14 ఏళ్లలో రూ.35 లక్షల లాభం అంటే నిజంగా పెద్ద మొత్తమేనా? ద్రవ్యోల్బణం, మెయింటెనెన్స్ ఖర్చులు, పన్నులు, కొన్నప్పుడు కట్టిన వడ్డీ లాంటివి తీసేస్తే అసలు లాభం ఇంకా తక్కువే ఉండొచ్చు. ఇదే డబ్బును స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి ఉంటే ఇంకా ఎక్కువ రాబడి వచ్చేదేమో.
ప్రభుదేవా ఉదాహరణ కొంత లాభాన్ని చూపించినా, రియల్ ఎస్టేట్ పెట్టుబడులన్నీ ఇలాగే ఉంటాయని అనుకోవడం సరికాదు. మార్కెట్ను సరిగ్గా అంచనా వేసి, ఆలోచించి నిర్ణయం తీసుకుంటేనే మంచి రాబడి సాధ్యమవుతుంది.