యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అతని ఫ్యామిలీ ప్రస్తుతం తీరని శోకంలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణం రాజు ఆదివారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణం రాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. నిన్ననే అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. టాలీవుడ్ ప్రముఖులంతా కృష్ణం రాజు మృతికి సంతాపం తెలిపారు.