ప్రస్తుతం మల్టీస్టారర్ చిత్రాలు తెరకెక్కించడం దర్శకులకు కత్తిమీద సాము లాంటి వ్యవహారమే. ఎందుకంటే ఇద్దరు హీరోలని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేయాలి. ఒకప్పుడు టాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రాలు ఎక్కువగా వచ్చేవి. కానీ ఇప్పుడు మల్టీస్టారర్ మూవీస్ తెరకెక్కించేందుకు దర్శకులు సాహసించడం లేదు. గోపాల, గోపాల, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఆర్ఆర్ఆర్ ఇలా అప్పుడప్పుడూ కొన్ని చిత్రాలు తళుక్కున మెరుస్తున్నాయి.