ఇటలీలో ప్రభాస్‌ హల్‌చల్‌.. ఫాలోయింగ్‌ మామూలుగా లేదుగా!

First Published Nov 6, 2020, 7:14 PM IST

ప్రభాస్‌కి ఉన్న క్రేజ్‌ మరోసారి బహిర్గతమయ్యింది. చైనా, జపాన్‌లో ప్రభాస్‌కి విశేషమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఆయన నటించిన `బాహుబలి` సినిమాతో ఆ క్రేజ్‌ రాగా, `సాహో` దాన్ని మరింత రెట్టింపు చేసింది. ఇటలీలోనూ ఆయనకు భారీగా ఫాలోయింగ్‌ ఉందని తాజాగా నిరూపితమైంది. 
 

ప్రస్తుతం ప్రభాస్‌ `రాధేశ్యామ్‌` చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.
undefined
ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల ఇటలీలో చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా లోకేషన్‌లో దిగిన పలు ఫోటోలను ఇటీవల చిత్ర బృందం పంచుకుంది.
undefined
అయితే అక్కడ తన ఇటలీ అభిమానులతో ఫోటోలు దిగారు ప్రభాస్‌. తనకిష్టమైన మసరెటీ బీఎండబ్ల్యూ కారు వద్ద దిగిన ఫోటో ఆకట్టుకుంటుంది.
undefined
అలాగే మార్నింగ్‌ జాగింగ్‌ చేస్తూ అభిమానులతో దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
undefined
మార్నింగ్‌ జాగింగ్‌లో భాగంగా అభిమానితో కలిసి థంబ్స్ చూపిస్తున్న ప్రభాస్‌.
undefined
ప్రభాస్‌ లాంటి స్టార్‌ హీరో తనతో ఫోటో దిగడంపై ఆ వ్యక్తి సంతోషాన్ని వ్యక్తం చేశారు.
undefined
అంతేకాదు అక్కడి అభిమానులు ప్రభాస్‌ ఫోటోలను తమ అకౌంట్ల ద్వారా పంచుకుంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. వీటితోపాటు ఇటలీలో చిత్ర యూనిట్‌ దిగిన ఫోటోలను కూడా తాజాగా ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. ప్రధాన తారాగణం, యూనిట్‌తో కలిసి ప్రభాస్‌ ఫోటోలకు పోజులిచ్చారు.
undefined
ఇటలీ షూటింగ్‌ పూర్తి చేసుకుని హైదరాబాద్‌ చేరుకుంది యూనిట్‌. త్వరలోనే హైదరాబాద్‌ షెడ్యూల్‌లో పాల్గొననున్నారు. దీంతో సినిమా దాదాపు చిత్రీకరణ పార్ట్ పూర్తికానుందట.
undefined
ఇటీవల ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన `రాధేశ్యామ్‌` మోషన్‌ పోస్టర్‌ విశేషంగా ఆకట్టుకుంది. అది సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యింది.
undefined
ఇందులో భాగ్యశ్రీ..ప్రభాస్‌కి తల్లిగా నటిస్తుండగా, ప్రియదర్శి, సచిన్‌ ఖేడ్కర్‌, కునాల్‌ రాయ్‌ కపూర్‌ వంటి వారు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణమూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
undefined
click me!