Adipurush Update: దీపావళి రోజు గుడ్‌న్యూస్‌ చెప్పిన ప్రభాస్‌.. `ఆదిపురుష్‌` సెట్‌లో సంబరాలు

First Published Nov 4, 2021, 9:17 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌.. దీపావళి పండుగ సందర్బంగా తన అభిమానులకు మరో గుడ్‌ న్యూస్‌ చెప్పారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న `ఆదిపురుష్‌` సినిమా షూటింగ్‌ని పూర్తి చేసుకున్నారు. సోషల్‌మీడియా ద్వారా ప్రభాస్‌, దర్శకుడు ఓం రౌత్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. 
 

ప్రభాస్‌ నటిస్తున్న `ఆదిపురుష్‌` సినిమా ముంబయిలో చిత్రీకరణ జరుపుకుంటోంది. వందవ రోజులు చిత్రీకరణ జరుపుకుంది. కరెక్ట్ గా వందవ రోజుకి ప్రభాస్‌ పాత్ర షూటింగ్‌ పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా పెద్ద కేక్‌కట్‌ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు చిత్ర యూనిట్‌. ఈ సందర్భంగా ప్రభాస్ తో చిత్ర బృందం దిగిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

 ప్రభాస్ పాత్ర షూటింగ్‌ పూర్తి కావడంతో చిత్ర బృందం ఊపిరి తీసుకుంది. దర్శకుడు ఓం రౌత్‌ సైతం తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. దీంతోపాటు యూనిట్‌ కూడా ఈ విషయాన్ని పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే రావణుడిగా నటిస్తున్న సైఫ్‌ అలీ ఖాన్‌, సీతగా నటిస్తున్న కృతి సనన్‌ పాత్ర షూటింగ్‌ లు పూర్తి చేసుకున్నాయి. ఇప్పుడు ప్రభాస్‌ పాత్ర కూడా పూర్తి కావడంతో ఆల్మోస్ట్ చిత్రీకరణ పూర్తియ్యిందని చెప్పొచ్చు. 

ప్రస్తుతం ప్రభాస్‌ సమక్షణంలో కేక్‌ కట్‌ చేసి యూనిట్ పండుగా చేసుకోగా, ఆ పిక్స్ నెట్టింట చక్కర్లుకొడుతున్నాయి. ఇందులో ప్రభాస్‌ లుక్‌ అదిరిపోయేలా ఉంది. గుబూరు మీసాలతో మెడలో కండువా బ్లాక్‌ టీషర్ట్ వేసుకుని ఆజానుభావుడిలా ఉన్నాడు ప్రభాస్‌. ఆయన లుక్‌ సైతం అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. సినిమాలో ఆయన్ని చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని పోస్ట్ లు పెడుతున్నారు ఫ్యాన్స్.

ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న `ఆదిపురుష్‌` చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా నటిస్తున్నారు. రావణుడి పాత్రలో సైఫ్‌ అలీ ఖాన్‌, సీతగా కృతి సనన్ నటిస్తుంది. పాన్ ఇండియా చిత్రంగా, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. టీ సిరీస్‌, ఓం రౌత్‌ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 
 

ఇక సినిమాని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నారు. ఆగస్ట్ 11న 2022లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంలో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు. భారీ స్థాయిలో సినిమాని రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. `బాహుబలి` చిత్రంలో బాహుబలి పాత్రతో దేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా పాపులర్‌ అయ్యారు, వరల్డ్ ఆడియెన్స్ ని అలరించారు. ఇప్పుడు `ఆదిపురుష్‌` చిత్రంతో రాముడిగా ఏ రేంజ్‌లో మెప్పిస్తాడో, ఏ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంటాడో చూడాలి. 

ప్రభాస్‌ ఈ చిత్రంతోపాటు `రాధేశ్యామ్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. దీంతోపాటు `సలార్‌` చిత్రంలో నటిస్తున్నాడు. `కేజీఎఫ్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఈ చిత్రం కూడా వచ్చే ఏడాది రిలీజ్‌ కాబోతుంది. వచ్చే ఏడాది మూడు సినిమాలతో ఎంటర్టైన్‌ చేయబోతున్నారు ప్రభాస్‌.
 

ప్రభాస్‌ ఈ చిత్రంతోపాటు `రాధేశ్యామ్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. దీంతోపాటు `సలార్‌` చిత్రంలో నటిస్తున్నాడు. `కేజీఎఫ్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఈ చిత్రం కూడా వచ్చే ఏడాది రిలీజ్‌ కాబోతుంది. వచ్చే ఏడాది మూడు సినిమాలతో ఎంటర్టైన్‌ చేయబోతున్నారు ప్రభాస్‌.
 

click me!